Rahul Gandhi: మోడీ ప్రసంగాలు ఆందోళన కరంగా ఉన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు నాయకుల మాటలు కూడా అంతే స్థాయిలో హీటెక్కుస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్-బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకున్నాయి. అయినా కూడా నేతలు ఎక్కడా తగ్గట్లేదు. తగ్గేదేలే.. అన్నట్టుగా మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ మధ్య మోడీ ఆందోళనగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బీజాపుర్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Samarth App: ఏపీ ఎన్నికలు 2024.. క్విక్ పోలీసింగ్ కోసం ఈసీ కొత్త యాప్
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
ఇటీవల మోడీ ప్రసంగాలు చూస్తుంటే.. ఆయన ఆందోళనగా ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. రానున్న రోజుల్లో ఆయన వేదికపై కన్నీరు పెట్టినా పెట్టొచ్చని వ్యాఖ్యానించారు. పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ప్రధాన సమస్యల నుంచి ఆయన తన మాటలతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్నారు. కొన్నిసార్లు చైనా, పాకిస్థాన్ అంటారని… ఇంకొన్నిసార్లు గిన్నెల శబ్దం చేయమంటారని.. మరికొన్ని సార్లు మీ ఫోన్లలో టార్చ్లైట్ ఆన్ చేయమని చెబుతారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
దేశ వ్యాప్తంగా రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక శుక్రవారం ముగిసిన రెండో విడత పోలింగ్లో 61 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలస్తోంది.
ఇది కూడా చదవండి: KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!