Rahul Gandhi: నితీష్ కూటమి నుంచి అందుకే వైదొలిగారు.. మౌనం వీడిన రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: బీహార్లో మహాఘటబంధన్ కూటమిని నితీష్ కుమార్ విడిచిపెట్టి ఎన్డీయేతో చేరిన కొద్ది రోజుల తర్వాత, నితీష్ ఇండియా కూటమిని వీడడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం మౌనం వీడారు. బీహార్ కులాల సర్వే కారణంగానే నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి నిష్క్రమించారని రాహుల్ గాంధీ అన్నారు. సామాజిక న్యాయంపై ప్రజల దృష్టి మరలడం బీజేపీకి ఇష్టం లేదని రాహుల్ అన్నారు. అందుకే నితీష్కి బీజేపీ ఒక మార్గాన్ని అందించింది. నితీష్ జీ ఆ బాటలో పయనించారు. నితీష్ జీ ఇక్కడ ఇరుక్కుపోయారని రాహుల్ గాందీ వెల్లడించారు.
Read Also: Hemant Soren: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యే ఛాన్స్.. నెక్ట్స్ సీఎం ఎవరంటే..!
Also Read
- PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
- Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
- Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
“నితీష్ జీ ఎందుకు ఇరుక్కుపోయాడో అర్థం చేసుకోండి. మీరు బీహార్లో కుల గణన నిర్వహించాలి అని నేను ఆయనకు సూటిగా చెప్పాను. మేము కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి నితీష్ జీని సర్వే చేయమని పట్టుబట్టాము. ఈ విషయంలో బీజేపీ భయపడింది. బీహార్లో కులగణన జరపాలని బీజేపీ కోరుకోలేదు. ఎందుకంటే వారు దేశానికి నిజం చెప్పడానికి భయపడుతున్నారు. ఈ క్రమంలోనే నితీష్పై వచ్చిన ఒత్తిడి కారణంగానే ఎన్డీయేలో చేరారు.” అని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బీహార్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రసంగించారు. మీకు సామాజిక న్యాయం కల్పించడం ఇండియా కూటమి బాధ్యత అని, దీనికి నితీష్ కుమార్ మాకు అవసరం లేదని రాహుల్ గాంధీ బీహార్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
Read Also: Rajyasabha: నితీష్-అజిత్ పవార్ రాకతో ఎన్డీయేకు పెరగనున్న సీట్లు
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి. విజయ్ సిన్హా ఆయన డిప్యూటీలుగా ఉన్నారు. అంతా సరిగ్గా లేనందునే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తలెత్తాయని నితీష్ కుమార్ అన్నారు.
తాజావార్తలు
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!