Hemant Soren: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యే ఛాన్స్.. నెక్ట్స్ సీఎం ఎవరంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారంలో నెలకొన్న బీహార్ సంక్షోభం ఆదివారంతో ఫుల్ స్టాప్ పడగా.. ఇప్పుడు ఝార్ఖండ్ వంతు వచ్చింది. తాజాగా ఝార్ఖండ్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ హాట్గా సాగుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మిస్సింగ్ అయ్యారంటూ వార్తలు హల్చల్ చేశాయి. వారం రోజుల క్రితం ఆయన ఢిల్లీలోని అధికార నివాసానికి వచ్చిన తర్వాత హేమంత్ కనిపించకుండపోయారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోమవారం ఢిల్లీలోని సీఎం నివాసానికి ఈడీ అధికారులు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి అందుబాటులో లేరు. దీంతో ఓ బీఎండబ్ల్యూ కారు, బ్యాగ్ సీజ్ చేసి అధికారులు వెళ్లిపోయారు. ఈ పరిణామంతో హేమంత్ సోరెన్ మిస్సింగ్ అంటూ మీడియాలో బర్నింగ్ టాఫిక్గా మారింది.
రాంచీలో హేమంత్ ప్రత్యక్షం..
మంగళవారం మధ్యాహ్నం హేమంత్ సోరెన్ రాంచీలో సడన్గా ప్రత్యక్షమయ్యారు. మరోవైపు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి రావాలని ముందుగానే ముఖ్యమంత్రి ఆదేశించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఈడీ అధికారులు వెంటాడుతుండడంతో అరెస్ట్ చేయడం ఖాయమన్న భావనతోనే హేమంత్ ఎమ్మెల్యేలను పిలిచినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అరెస్ట్కు ముందుగానే తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు హేమంత్ పిలిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా సీఎం నివాసానికి చేరుకున్నారు. వారం రోజులు రాంచీలోనే ఉండాలని హైకమాండ్ ఆదేశించడంతో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా లగేజీలతో సోమవారమే రాంచీలో మకాం వేసేశారు.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
సీఎంగా కల్పనా..
మరికాసేపట్లో హేమంత్ సోరెన్ అధ్యక్షతన కూటమి ఎమ్మెల్యేలంతా భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రిగా హేమంత్ భార్య కల్పనా సోరెన్ను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే ప్రభుత్వం అస్థితర పడకుండా ఉండేందుకు హేమంత్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.
హేమంత్ భయపడుతున్నారు: దూబే
ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ మిస్సింగ్పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ విచారణకు సీఎం హేమంత్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే ముఖ్యమంత్రి బాధ్యతలు హేమంత్ సతీమణి కల్పనకు అప్పగించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!