Hemant Soren: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యే ఛాన్స్.. నెక్ట్స్ సీఎం ఎవరంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారంలో నెలకొన్న బీహార్ సంక్షోభం ఆదివారంతో ఫుల్ స్టాప్ పడగా.. ఇప్పుడు ఝార్ఖండ్ వంతు వచ్చింది. తాజాగా ఝార్ఖండ్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ హాట్గా సాగుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మిస్సింగ్ అయ్యారంటూ వార్తలు హల్చల్ చేశాయి. వారం రోజుల క్రితం ఆయన ఢిల్లీలోని అధికార నివాసానికి వచ్చిన తర్వాత హేమంత్ కనిపించకుండపోయారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోమవారం ఢిల్లీలోని సీఎం నివాసానికి ఈడీ అధికారులు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి అందుబాటులో లేరు. దీంతో ఓ బీఎండబ్ల్యూ కారు, బ్యాగ్ సీజ్ చేసి అధికారులు వెళ్లిపోయారు. ఈ పరిణామంతో హేమంత్ సోరెన్ మిస్సింగ్ అంటూ మీడియాలో బర్నింగ్ టాఫిక్గా మారింది.
రాంచీలో హేమంత్ ప్రత్యక్షం..
మంగళవారం మధ్యాహ్నం హేమంత్ సోరెన్ రాంచీలో సడన్గా ప్రత్యక్షమయ్యారు. మరోవైపు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి రావాలని ముందుగానే ముఖ్యమంత్రి ఆదేశించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఈడీ అధికారులు వెంటాడుతుండడంతో అరెస్ట్ చేయడం ఖాయమన్న భావనతోనే హేమంత్ ఎమ్మెల్యేలను పిలిచినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అరెస్ట్కు ముందుగానే తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు హేమంత్ పిలిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా సీఎం నివాసానికి చేరుకున్నారు. వారం రోజులు రాంచీలోనే ఉండాలని హైకమాండ్ ఆదేశించడంతో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా లగేజీలతో సోమవారమే రాంచీలో మకాం వేసేశారు.
Also Read
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
సీఎంగా కల్పనా..
మరికాసేపట్లో హేమంత్ సోరెన్ అధ్యక్షతన కూటమి ఎమ్మెల్యేలంతా భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రిగా హేమంత్ భార్య కల్పనా సోరెన్ను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే ప్రభుత్వం అస్థితర పడకుండా ఉండేందుకు హేమంత్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.
హేమంత్ భయపడుతున్నారు: దూబే
ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ మిస్సింగ్పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ విచారణకు సీఎం హేమంత్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే ముఖ్యమంత్రి బాధ్యతలు హేమంత్ సతీమణి కల్పనకు అప్పగించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..