Bharat Jodo Yatra: అంబులెన్స్కు దారి ఇచ్చేందుకు యాత్రను నిలిపివేసిన రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: ఢిల్లీలో అంబులెన్స్కు దారి ఇవ్వడానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం తన భారత్ జోడో యాత్రను అపోలో ఆసుపత్రి సమీపంలో నిలిపివేశారు. అంబులెన్స్ని వెళ్లనివ్వడానికి కాసేపు ఆగాడు. అంబులెన్స్కు దారి ఇవ్వాలని తోటి యాత్రికులను కూడా కోరాడు. ఈ సంఘటన దేశ రాజధానిలోని అపోలో ఆసుపత్రి సమీపంలో జరిగింది. ఇవాళ ఉదయం 8:30 గంటలకు గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర ఉదయం హర్యానాలోని బదర్పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది. బదర్పూర్ బోర్డర్ నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఢిల్లీలోని 23 కిలోమీటర్ల మేర సాగి ఎర్రకోట దగ్గర ముగుస్తుంది. ఈ యాత్ర ఆశ్రమ్ చౌక్, నిజాముద్దీన్, ఇండియా గేట్, ఐటీవో, రెడ్ ఫోర్ట్, రాజ్ ఘాట్ మీదుగా వెళుతుంది. ఎర్రకోటకు వెళ్లే ముందు ఆశ్రమ చౌక్ వద్ద రెండు గంటల విరామం తీసుకోనున్నారు. భారత్ జోడో యాత్ర ఇప్పటికే దాదాపు 3,000 కిలోమీటర్లు ప్రయాణించింది.
Encounter: బీజాపూర్లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు బీజేపీని ఎండగట్టేందుకు కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన రాహుల్ గాంధీ పాదయాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా మీదుగా ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర ఐదు నెలల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగనుంది. మొత్తంగా 3570 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ. కాశ్మీర్లో జరిగే జోడో యాత్రతో ఈ పాదయాత్ర ముగియనుంది. 2023 జనవరి26న కాశ్మీర్ లో ఈ యాత్ర ముగియనుంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..