Rahul Gandhi: రామేశ్వర్తో కలిసి భోజనం చేసిన రాహుల్.. ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆజాద్పూర్ మండి కూరగాయల విక్రేత రామేశ్వర్ను కలిశారు. అనంతరం రామేశ్వర్తో కలిసి రాహుల్ భోజనం చేశారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని ఆజాద్పూర్ మండిలో రామేశ్వర్ కూరగాయలు అమ్ముతున్న వీడియో వైరల్ అయింది. టమాటాలను పెద్దమొత్తంలో కొనేందుకు తాను మండికి వచ్చానని.. అయితే ధర ఎక్కువగా ఉందని, అందుకోసం కొనలేనంటూ ఏడుస్తూ రామేశ్వర్ వీడియోలో చెప్పాడు. అంతేకాకుండా.. రాహుల్ను కలవాలన్న కోరికను కూడా ఆ వీడియోలో తెలిపాడు. రాహుల్ గాంధీ రామేశ్వర్ను కలిసిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతేకాకుండా.. రామేశ్వర్ జీ సజీవమైన వ్యక్తి అని రాహుల్ తెలిపారు. కోట్లాది భారతీయుల సహజసిద్ధమైన స్వభావానికి సంబంధించిన సంగ్రహావలోకనం అతనిలో కనిపిస్తుందని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా చిరునవ్వుతో ముందుకు సాగే వారు నిజంగా ‘భారత్ భాగ్య విధాత’ అని రాహుల్ గాంధీ రాశారు.
MLC Kavitha: గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
మరోవైపు గత వారం రామేశ్వర్ ను కలిసేందుకు రాహుల్ గాంధీ.. ఆజాద్పూర్ మండికి వెళ్లారు. అక్కడ కూరగాయల విక్రేతలను కలుసుకుని వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లిన సమయంలో రామేశ్వర్ లేడు. అయితే, ఆ తర్వాత రాహుల్ గాంధీ అక్కడికి వచ్చిన విషయం తెలుసుకుని.. రాహుల్ను కలవాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో సోమవారం రామేశ్వర్ ను తన ఇంటికి పిలిచి అతనితో డిన్నర్ చేసారు రాహుల్ గాంధీ.
Droupadi Murmu: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి కీలక సందేశం
ఇటీవల ఆజాద్పూర్ మండిలో రామేశ్వర్తో ఓ విలేకరి మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటపడింది. అందులో రామేశ్వర్ తన ఖాళీ బండితో కనిపించాడు. టమాటా కొనేందుకు మండికి వచ్చానని, అయితే ధరలు ఎక్కువగా ఉన్నాయని.. వాటిని కొనలేకపోతున్నానని రామేశ్వర్ విలేకరులతో చెప్పారు. వేరే కూరగాయలు కొనరా అని విలేఖరి అడగ్గా.. అతడు తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. ఇలా చెబుతూ రామేశ్వర్ ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను రాహుల్ స్వయంగా ట్వీట్ చేసి ద్రవ్యోల్బణం సమస్యపై ప్రభుత్వాన్ని చుట్టుముట్టారు. దేశాన్ని రెండు వర్గాలుగా విభజిస్తున్నారని రాహుల్ తెలిపారు. ఒకవైపు శక్తితో రక్షించబడుతున్న శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారు, వారి సూచనల మేరకు దేశ విధానాలు తయారు చేయబడుతున్నాయని తెలిపారు. మరోవైపు సాధారణ భారతీయుడు ఉన్నాడని.. వారికి కూరగాయలు వంటి ప్రాథమిక విషయాలు కూడా దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కూడా లోక్సభలో రామేశ్వర్ను ప్రస్తావించారు.
रामेश्वर जी एक ज़िंदादिल इंसान हैं!
उनमें करोड़ों भारतीयों के सहज स्वभाव की झलक दिखती है।
विपरीत परिस्थितियों में भी मुस्कुराते हुए मज़बूती से आगे बढ़ने वाले ही सही मायने में 'भारत भाग्य विधाता' हैं। pic.twitter.com/DjOrqzLwhj
— Rahul Gandhi (@RahulGandhi) August 14, 2023
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!