IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్తో భారత్పై బద్దలైన రికార్డులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్తో ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్తో అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టులో గుర్బాజ్ ఒక్కడే భారత బౌలర్లపై ఒంటరి పోరాటం చేస్తూ చెలరేగిపోయాడు. అతను కేవలం 48 బంతుల్లోనే శతక మార్క్ను అందుకొని వన్డే క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్గా గుర్బాజ్ సరికొత్త రికార్డును లిఖించాడు.
గతంలో మొహమ్మద్ షాజాద్ 72 బంతుల్లో చేసిన రికార్డును గుర్బాజ్ దాటేశాడు. కేవలం తన దేశ రికార్డులనే కాకుండా బలమైన టీమిండియాపై వన్డేల్లో రెండో అత్యంత వేగవంతమైన శతకం బాదిన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. గతంలో భారత్పై 45 బంతుల్లో షాహిద్ అఫ్రిది చేసిన సెంచరీ మొదటి స్థానంలో ఉండగా, జేమ్స్ ఫాల్క్నర్, ఏబీ డివిలియర్స్ (57 బంతులు) రికార్డులను గుర్బాజ్ అధిగమించాడు.
Also Read
- Pakistan: మరో గల్ఫ్ దేశంతో పాక్ రక్షణ ఒప్పందం.. కన్నేసుంచిన భారత్
- Earthquake: జపాన్లో 7.1తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
- Istamart CEO: ఇన్స్టామార్ట్ సీఈఓ రాజీనామా.. భారీగా పెరిగిన స్విగ్గీ షేర్లు..
- రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
ఈ మ్యాచ్లో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గుర్బాజ్, మొత్తం 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు మరియు 200.00 స్ట్రైక్ రేట్తో సరిగ్గా 102 పరుగులు చేసి నితీష్ రెడ్డి బౌలింగ్లో అవుటయ్యాడు. మిగిలిన బ్యాటర్లలో కెప్టెన్ హష్మతుల్లా షాహిది 27 పరుగులు, అజ్మతుల్లా ఒమర్జాయ్ 26 పరుగులు చేయగా, భారత బౌలర్లలో హర్ష్ దూబే 3 వికెట్లు, అర్ష్దీప్ సింగ్ మరియు నితీష్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు.
ఈ ఇన్నింగ్స్తో వన్డేల్లో హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మార్చే రికార్డులో 56.25 శాతంతో గుర్బాజ్ ప్రపంచంలోనే టాప్ ప్లేస్కు దూసుకెళ్లాడు. ఈ విషయంలో అతను విరాట్ కోహ్లీ (41.22%), క్వింటన్ డికాక్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టడం విశేషం. భారత్పై ఒకే వన్డే ఇన్నింగ్స్లో ఏకంగా 8 సిక్సర్లు బాదిన గుర్బాజ్, ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తన సొంత రికార్డును మూడోసారి సమం చేశాడు.
అలాగే ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ల చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన సెంచరీగా నిలిచింది. ధర్మశాల మైదానంలో కూడా ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. తన కెరీర్లో 9వ వన్డే సెంచరీని అత్యంత చిరస్మరణీయంగా మార్చుకుంటూ గుర్బాజ్ సృష్టించిన ఈ విధ్వంసం క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇక.. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ 3 వికెట్ల చొప్పున తీయగా.. నితీష్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్ తలా 2 వికెట్లు తీసి ఆఫ్ఘన్ను కట్టడి చేశారు.
తాజావార్తలు
-
Pakistan: మరో గల్ఫ్ దేశంతో పాక్ రక్షణ ఒప్పందం.. కన్నేసుంచిన భారత్
-
Istamart CEO: ఇన్స్టామార్ట్ సీఈఓ రాజీనామా.. భారీగా పెరిగిన స్విగ్గీ షేర్లు..
-
Earthquake: జపాన్లో 7.1తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
-
Johnson & Johnson: వేల కోట్ల సెటిల్మెంట్కి రెడీ అయిన ప్రపంచ దిగ్గజ కంపెనీ.. అక్షరాల రూ.52 వేల కోట్లు ఇవ్వడానికి డీల్!
-
Allu Arjun: హేటర్స్కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్.. ఏం చెప్పాడు భయ్యా!
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!