Putin: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
- ఈనెల 12-13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ సమావేశాలు
- బ్రిక్స్కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్
- ప్రధాని మోడీతో భేటీకానున్న రష్యా అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 12-13 తేదీల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్లో సభ్య దేశాధినేతలు హస్తినకు రాబోతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా రాబోతున్నారు. అయితే బ్రిక్స్ సమావేశాలకు ముందుగానే పుతిన్ ఢిల్లీకి వచ్చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఢిల్లీకి రాబోతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో సమావేశం కాబోతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు.. పాశ్చాత్య ఆంక్షలు, తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
భారతదేశాన్ని రష్యాకు ‘‘వ్యూహాత్మక భాగస్వామి’’గా అభివర్ణిస్తూ.. శుక్రవారం ప్రధాని మోడీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగబోతున్నట్లుగా క్రెమ్లిన్ ధృవీకరించింది. రష్యా అధ్యక్షుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి క్రెమ్లిన్ అధికార ప్రతినిధి, పుతిన్ ప్రెస్ సెక్రటరీ అయిన డిమిత్రి పెస్కోవ్ మంగళవారం వర్చువల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన వ్యాఖ్యలు భారత్-రష్యా సంబంధాలలోని సౌహార్దాన్ని, అలాగే మారుతున్న ప్రపంచ క్రమాన్ని ప్రతిబింబించాయి.
Also Read
- PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
- Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
- Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్పై కేసు!
‘‘రెండు దేశాల మధ్య పరస్పర సంప్రదింపులు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీతో జరిగే సమావేశం. మీకు తెలిసినట్లుగా భారతదేశం-రష్యా నాయకుల మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి సంబంధం చాలా ఆచరణాత్మకమైనది. వారు ఒకరితో ఒకరు ఎంత నిజాయితీగా ఉంటారంటే.. ప్రపంచ ఎజెండా, మన పరస్పర సంబంధాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమస్యలను కూడా వారు చాలా బహిరంగంగా, నిర్మాణాత్మకంగా చర్చించగలరు.’’ అని పెస్కోవ్ అన్నారు.
బ్రిక్స్ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ పెస్కోవ్ ఇలా అన్నారు. ‘‘బ్రిక్స్ ఒక సంస్థ కాదు. అది ఒక కూటమి అని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మాకు శాసనం, నియమాలు లేదా శాశ్వత కార్యాలయం లేవు. దానికి బదులుగా ప్రపంచంలో పనులు ఎలా జరగాలి. వివిధ రంగాలలో సహకారం ఎలా కొనసాగించాలి అనే దానిపై ఉమ్మడి దృక్పథాన్ని పంచుకునే దేశాల కూటమి ఇది.’’ అని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ-అధ్యక్షుడు పుతిన్ చర్చల సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధం, శాంతి ప్రయత్నాలు కూడా కీలక అంశంగా మారే అవకాశం ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సంప్రదింపులు, దౌత్యం అవసరమని భారతదేశం మొదటి నుంచి నొక్కి చెబుతోంది. ఈ విషయంలో భారతదేశ పాత్ర గురించి అడగ్గా ‘‘భారత ప్రయత్నాలను మేము స్వాగతిస్తున్నాము.’’ అని పెస్కోవ్ అన్నారు.
తాజావార్తలు
-
Putin: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
-
Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!