Raghunandan Rao : ముత్యాలమ్మ టెంపుల్ ఎపిసోడ్లో పూర్తి స్థాయి విచారణ జరగాలి
- సంఘ విద్రోహ శక్తులు
- స్లీపర్ సెల్స్ ఏవైనా కుట్రలు చేస్తున్నాయా..?
- ముత్యాలమ్మ టెంపుల్ కు సమీపంలో స్లీపర్ సెల్స్ కు శిక్షణ
- డీజీపీ సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలి : ఎంపీ రఘునందన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాదులోని శ్రీ ముత్యాలమ్మ దేవి ఆలయం వద్ద శనివారం ఆలయ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున గుమిగూడిన ఆందోళనకారులపై తెలంగాణ పోలీసులు లాఠీచార్జి చేశారు . తెలంగాణలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి), భజరంగ్ దళ్ రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నిరసనలకు పలు హిందూ సంస్థలు మద్దతు తెలిపాయి. అయితే.. తాజాగా ఎంపీ రఘునందన్ రావు డీజీపీని కలిసి ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ముత్యాలమ్మ టెంపుల్ ఎపిసోడ్ లో పూర్తి స్థాయి విచారణ జరగాలని, సంఘ విద్రోహ శక్తులు, స్లీపర్ సెల్స్ ఏవైనా కుట్రలు చేస్తున్నాయా..? అని ఆయన ప్రశ్నించారు. ముత్యాలమ్మ టెంపుల్ కు సమీపంలో స్లీపర్ సెల్స్ కు శిక్షణ అని, మునవర్ అనే వ్యక్తి ఎవరు..? ఎక్కడించి వచ్చారు.? ఇంటిలిజెన్స్ ఏం చేస్తోంది..? అని రఘునందన్ రావు అన్నారు.
Deputy CM Pawan Kalyan: గత ఐదేళ్లలో పారిశుద్ధ్యంపై ఎలాంటి డబ్బులు ఖర్చులు చేయలేదు..
Also Read
అక్కడ పర్సనల్ డెవలప్ మెంట్ క్లాసులు జరుగుతున్నాయా..? లేక స్లీపర్ సెల్స్ కు శిక్షణ ఇచ్చారా..? స్లీపర్ సెల్స్ ఓపెన్ సెల్స్ గా మారితే పరిస్థితి ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు. నెలల తరబడి శిక్షణ కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటిలిజెన్స్, లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోందని, తెలంగాణలో 3 మాసాల వ్యవధిలో 15 మందిరాల మీద దాడులు జరిగాయని, ముత్యాలమ్మ గుడి దగ్గర ర్యాలీ చేస్తే… పోలీసులు అరెస్ట్ లు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. లాఠీ ఛార్జ్ చేస్తున్నారన్నారు రఘునందన్ రావు. హిందువులే పోలీసులపై దాడి చేసినట్లు కొంత మంది అధికారులు వీడియోలు రిలీజ్ చేయడం పద్ధతి కాదని, భాగ్యనగర ప్రశాంతతను కాపాడాలన్నారు. సమగ్ర విచారణ జరగాలని డీజీపీని కోరడం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మునావర్ లాంటి వాళ్ళు నెలల కొద్ది శిక్షణ ఇస్తున్నా ఇంటలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు..? అని, ముత్యాలమ్మ గుడి ఘటన పోలీసు ఇంటలిజెన్స్ వైఫల్యమే కారణమన్నారు.
Ganderbal Terror Attack: ఉగ్రవాదంపై పోరులో దేశం ఏకమైంది: రాహుల్ గాంధీ
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!