Ganderbal Terror Attack: ఉగ్రవాదంపై పోరులో దేశం ఏకమైంది: రాహుల్ గాంధీ
- ఉగ్రవాదంపై పోరులో దేశం ఏకమైంది.
- జమ్మూకశ్మీర్లోని గందర్బల్లో ఉగ్రవాదులు పిరికిపంద చర్యపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.
Ganderbal Terror Attack: జమ్మూకశ్మీర్లోని గందర్బల్లో ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మెస్లో భోజనం చేస్తున్న కార్మికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ డాక్టర్తో సహా ఏడుగురు చనిపోయారు. ఈ ఉగ్రదాడిపై తాజాగా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్లోని గందర్బల్లో జరిగిన ఉగ్రదాడిలో వైద్యుడు, వలస కూలీలు సహా పలువురిని చంపడం చాలా పిరికి పని అని, క్షమించరాని నేరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Read Also: Naga Chaitanya Shobita Weeding: మొదలైన నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు..
Also Read
ఉగ్రవాదుల ఈ దుస్సాహసం జమ్మూకశ్మీర్లో జీవన విధానాన్ని, ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయదని రాహుల్ గాంధీ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో దేశం మొత్తం ఏకమై ఉందని ఉద్ఘాటించారు.
Read Also: Malla Reddy Mass Dance: పెళ్లి సంగీత్ లో మల్లన్న మాస్ స్టెప్పులు..
जम्मू-कश्मीर के गांदरबल में आतंकी हमले में एक डॉक्टर और प्रवासी मज़दूरों समेत कई लोगों की हत्या बहुत ही कायरतापूर्ण और अक्षम्य अपराध है।
सभी शोकाकुल परिवारों के प्रति अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के शीघ्र स्वस्थ होने की आशा करता हूं।
आतंकियों का यह दुस्साहस…
— Rahul Gandhi (@RahulGandhi) October 21, 2024
ఇక ఈ విషయంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా తాజాగా ఈ దాడిని ఖండించారు. గందర్బల్ జిల్లాలోని గుండ్ ప్రాంతంలో సొరంగం నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ కంపెనీ కార్మికుల శిబిరాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని గడ్కరీ తెలిపారు. ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు కార్మికులు, ఒక వైద్యుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్లో, జమ్మూకశ్మీర్లోని సోనామార్గ్లోని గగాంగీర్లో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో నిమగ్నమై ఉన్న అమాయక కార్మికులపై జరిగిన ఉగ్రదాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని గడ్కరీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో అమరులైన కార్మికులకు నా వినయపూర్వకమైన నివాళులర్పిస్తున్నాను. ఇంకా వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని పార్థిస్తున్నట్లు ఆయన రాసుకొచ్చారు.
I strongly condemn the horrific terror attack on innocent laborers in Gagangir, Sonamarg, Jammu & Kashmir, who were engaged in a vital infrastructure project.
I offer my humble tribute to the martyred laborers and extend my deepest condolences to their families during this…
— Nitin Gadkari (@nitin_gadkari) October 20, 2024
తాజావార్తలు
-
Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!