MP Raghav Chadha: పార్లమెంట్లో రూ.19 వేల కోట్ల బ్యాంకుల గుట్టు విప్పిన ఎంపీ రాఘవ్ చద్ధా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Raghav Chadha: భారతదేశ బ్యాంకింగ్ రంగంలో సామాన్యులపై జరుగుతున్న ఒక ‘నిశ్శబ్ద దోపిడీ’ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా పార్లమెంటు వేదికగా ఎండగట్టారు. బ్యాంక్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ (Minimum Balance) నిర్వహించలేదనే నెపంతో గత మూడేళ్లలో బ్యాంకులు ఏకంగా రూ.19,000 కోట్లు పెనాల్టీల రూపంలో వసూలు చేశాయని ఆయన వెల్లడించారు. ఈ గణాంకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
READ ALSO: LPG Cylinder Booking: గ్యాస్ సిలిండర్ల కోసం భారీ క్యూలైన్ల నుంచి ఉపశమనం.. ఇలా చేయండి..
Also Read
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
ఎవరి జేబుల నుంచి ఈ నిధులు..
ఈ సందర్భంగా రాఘవ్ చద్ధా తన ప్రసంగంలో ఈ వసూళ్ల వెనుక ఉన్న చేదు నిజాలను వివరించారు. ఈ వేల కోట్లు బిలియనీర్ల నుంచో లేదా బడా పారిశ్రామికవేత్తల నుంచో వచ్చినవి కావని, ఇవి పూర్తిగా రైతులు, పెన్షనర్లు, రోజువారీ కూలీలు, మధ్యతరగతి ప్రజల కష్టార్జితమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం.. ప్రైవేట్ బ్యాంకులు సుమారు రూ.11,000 కోట్లు వసూలు చేశాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs) సుమారు రూ.8,000 కోట్లు వసూలు చేశాయి. ప్రైవేట్ బ్యాంకులు సామాన్యుల నుంచి భారీగా పెనాల్టీలు వసూలు చేయడంలో ముందున్నాయని ఈ లెక్కలు చెబుతున్నాయి.
మినిమమ్ బ్యాలెన్స్ లేనందుకు జరిమానా విధించడాన్ని రాఘవ్ చద్ధా “పేదరికంపై వేసిన పన్ను”గా అభివర్ణించారు. ఒక రైతు తన అవసరాల కోసం అకౌంట్ ఖాళీ చేసినప్పుడు లేదా ఒక పెన్షనర్ మందుల కోసం డబ్బు తీసుకున్నప్పుడు బ్యాలెన్స్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు బ్యాంకులు సేవలు అందించాల్సింది పోయి, రివర్స్లో రూ.100 నుంచి రూ.500 వరకు పెనాల్టీలు వేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. జన్ ధన్ ఖాతాలకు మినహాయింపు ఉన్నప్పటికీ, సాధారణ సేవింగ్స్ ఖాతా కలిగిన కోట్లాది మంది సామాన్యులు ఈ పెనాల్టీల భారంతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు.
పెనాల్టీలు రద్దు చేయాల్సిందే..
బ్యాంకులు తమ నిర్వహణ ఖర్చుల పేరుతో ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టడం సరికాదని, ఈ మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీలను తక్షణమే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని, ఆర్బీఐ (RBI)ని డిమాండ్ చేశారు. నిజమైన ఆర్థిక సమతుల్యత సాధించాలంటే పేదవారిపై ఈ భారాన్ని తొలగించడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన పార్లమెంట్ వేదికగా మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “చివరికి సామాన్యుడి బాధను వినిపించే గొంతుక పార్లమెంటులో వినిపించింది” అంటూ నెటిజన్లు రాఘవ్ చద్ధాకు మద్దతు తెలుపుతున్నారు.
₹19,000 crore.
That is what Banks collected in last 3 years just for not maintaining ‘Minimum Account Balance.’
Not from the rich. Not from big borrowers.
From the poorest accounts in the system.
Their crime? They didn’t have enough money.A farmer misses the minimum balance… pic.twitter.com/DqZ1CSCOoV
— Raghav Chadha (@raghav_chadha) March 17, 2026
READ ALSO: Sarke Chunar Song: మంగ్లీకి ఇదేం పోయే కాలం.. బూతు పాటని తెలిసి పాడిందా నెటిజన్లు ఫైర్ !
తాజావార్తలు
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!