Bihar : ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులకు శిక్ష వేసిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar : బీహార్లోని పాట్నా హైకోర్టు వరకట్న వేధింపుల కేసు విచారణలో ఇద్దరు న్యాయమూర్తులపై చర్యలు తీసుకుంది. విచారణను తప్పుగా నిర్వహించి, ఆపై పిటిషనర్కు శిక్ష విధించిన కేసులో సమస్తిపూర్ జిల్లా కోర్టులోని ఇద్దరు జడ్జీలకు కోర్టు సింబాలిక్ శిక్షను విధించింది. పిటిషనర్కు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఇద్దరు న్యాయమూర్తులు ఒక్కొక్కరికి రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆ వ్యక్తిని అనవసరంగా దోషిగా నిర్ధారించారని జస్టిస్ వివేక్ చౌదరి ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తనకు సబార్డినేట్ కోర్టు విధించిన శిక్షను వ్యతిరేకిస్తూ దాల్సింగ్సరాయ్ సబ్ డివిజన్కు చెందిన సునీల్ పండిట్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించిన సందర్భంగా న్యాయమూర్తి పై ఉత్తర్వులు జారీ చేశారు.
2016లో సమస్తిపూర్ అదనపు సెషన్స్ కోర్టు తనకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను పండిట్ సవాలు చేశారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో పిటిషనర్ పేరు ఉంది. తన భర్త వరకట్నం వేధిస్తున్నాడని మహిళ ఆరోపించింది. జస్టిస్ చౌదరి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 498A (భర్త లేదా అతని బంధువుల ద్వారా స్త్రీ పట్ల క్రూరత్వం), వరకట్న చట్టం ప్రకారం నేరం నుండి పిటిషనర్ను నిర్దోషిగా ప్రకటించారు.
Also Read
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
Read Also:RCB vs SRH: ప్రతి మ్యాచ్లో అది కుదరదు.. సన్రైజర్స్ ఓటమిపై కమిన్స్!
పాట్నా హైకోర్టు చర్య
పిటిషనర్ మహిళ భర్తకు బంధువు కాదని, ఇతర నిందితులకు సలహాదారు మాత్రమేనని కోర్టు గుర్తించింది. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులోని క్రిమినల్ క్యాష్ సెక్షన్లో ఒక్కొక్కరు రూ.100 చొప్పున టోకెన్ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని సంబంధిత జ్యుడీషియల్ ఆఫీసర్లు సబ్-డివిజనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, దల్సింగ్సరాయ్, అడిషనల్ సెషన్స్ జడ్జి III, సమస్తిపూర్లను కోర్టు ఆదేశించింది.
మానసిక వేదనకు గురైన పిటిషనర్
రెండు సబార్డినేట్ కోర్టుల ఉదాసీన వైఖరి కారణంగా పిటిషనర్కు కలిగే మానసిక వేదన, గాయం, సామాజిక కళంకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ టోకెన్ మొత్తం జరిమానా విధిస్తున్నట్లు జస్టిస్ చౌదరి తెలిపారు. ఫిర్యాదును జాగ్రత్తగా విచారించి, ఆ తర్వాత విచారణ చేపట్టి నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అన్ని కోర్టుల బాధ్యత అని జస్టిస్ చౌదరి అన్నారు.
Read Also:Kolikapudi Srinivasa Rao: నన్ను గెలిపిస్తే.. తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా..!
తాజావార్తలు
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!