Purandeswari: పోలవరం ప్రాజెక్టును డబ్బు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటించారు. జంగారెడ్డిగూడెం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించడం లేదు అనేది అవాస్తవం.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే.. నీళ్ళు తోడుకొడానికి ఉపయోగించుకోవాల్సిన పోలవరం ప్రాజెక్టును డబ్బు తోడుకునెందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. పోలవరం నిర్మాణానికి ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.. త్వరలో వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు పోలవరం లో పర్యటిస్తాం.. ఓటుతో సంబంధం లేకుండా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. ఆడుదాం ఆంధ్రా సంగతి ఎలా ఉన్నా.. ప్రజలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోంది అని పురంధేశ్వరి తెలిపారు.
Read Also: KTR: అప్పుల గురించి మాట్లాడతారు కానీ.. ఆస్తుల గురించి మాట్లడరా..?
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
పెట్టుబడులు పక్క రాష్ట్రాలు వాళ్ళు తీసుకుపోతున్నారు అంటూ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడమే పనిగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది.. పార్లమెంట్ సాక్షిగా అమరావతి రాజధాని అని ప్రకటించింది.. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుంది.. ఒక్క ఏలూరు జిల్లాకే లక్ష ఇళ్ళు కేంద్రం కేటాయించింది.. జగనన్న కాలనీలు ఎలా ఉన్నాయో ప్రజలు చూస్తున్నారు అంటూ ఆయన ఆరోపించారు. 22 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది.. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పూర్తి చేసింది అనేది శ్వేత పత్రం ఇవ్వాలి.. గ్రీన్ ఫీల్డ్ హైవే, ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించాలి.. తొమ్మిదిన్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి పర్యటన కొనసాగిస్తున్నామని పురందేశ్వరి చెప్పారు.
తాజావార్తలు
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..