Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్ స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ముఠాల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇటువంటి ఒక భారీ నకిలీ టూత్పేస్ట్ తయారీ కేంద్రాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. నమ్మకమైన బ్రాండ్గా పేరున్న ‘సెన్సోడైన్’ (Sensodyne) పేరుతో కల్తీ పేస్ట్ను తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించి అధికారులు దానిని సీజ్ చేశారు.
ఢిల్లీ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఒక రహస్య ప్రాంతంలో కొనసాగుతున్న ఈ నకిలీ తయారీ యూనిట్పై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలైన సెన్సోడైన్ ప్యాకేజింగ్ను పోలి ఉండేలా అత్యంత నైపుణ్యంతో ఈ నకిలీ ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నట్లు గుర్తించారు.
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
పోలీసుల దాడిలో భారీ మొత్తంలో కల్తీ సరుకు దొరికింది. ఇందులో ప్రధానంగా.. 3,000 కంటే ఎక్కువ నింపిన నకిలీ సెన్సోడైన్ ట్యూబ్లు, 10,000 ఖాళీ ట్యూబ్లు (ప్యాకింగ్కు సిద్ధంగా ఉన్నవి). సుమారు 130 కిలోల విడి పేస్ట్, ప్యాకేజింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read:Story Board: ఎన్నికల సమయంలో ఉచితాలు బాధ్యతారాహిత్యం..
ఈ అక్రమ వ్యాపారానికి సూత్రధారి, ఫ్యాక్టరీ యజమాని అయిన హరి మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తక్కువ ఖర్చుతో నాసిరకం రసాయనాలను ఉపయోగించి ఈ పేస్ట్ను తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ నకిలీ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లతో పాటు చిన్న చిన్న కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇలాంటి నకిలీ టూత్పేస్ట్లను ఉపయోగించడం వల్ల చిగుళ్ల వ్యాధులు, పంటి ఎనామిల్ దెబ్బతినడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ప్యాకేజింగ్, బార్ కోడ్ మరియు ధరను జాగ్రత్తగా గమనించాలని పోలీసులు సూచించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!