Purandeswari: ఏపీలో కక్షపూరిత రాజకీయాలు చూస్తున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలోని సాగరమాల ఆడిటోరియంలో బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి, ఆరు రాష్ట్రాల శంఖనాధ్ ఇన్ చార్జ్ దావల్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దగ్గబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు అనే ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని పిలుపునిచ్చారు. పోలవరం, ప్రత్యేక హోదా విషయంలో దుష్ప్రచారం జరుగుతోంది.. ప్రత్యేక హోదాకు సరిసమానమైన ప్యాకేజీని ఇస్తామంటే అప్పటి ప్రభుత్వం అంగీకరించింది అని ఆమె పేర్కొన్నారు.
Read Also: India-Canada Dispute: మహీంద్రా తర్వాత కెనడాకు షాక్ ఇచ్చిన మరో భారతీయ కంపెనీ
Also Read
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
పోలవరం బిల్లులు సకాలం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది అని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. డయాఫ్రామ్ వాల్ డిజైన్ లోపానికి కేంద్రాన్ని ఎలా బాధ్యులను చేస్తారు.. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్రాన్ని తప్పుపడుతున్నారు.. పెట్టుబడుల ఉపసంహరణకు బీజేపీ అధికారంలోకి రాక ముందే ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది అని ఆమె తెలిపారు. స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ జరిగితే సిబ్బంది భవిష్యత్తు బాద్యత మాపై వుంది.. ఏపీలో కక్ష పూరిత రాజకీయాలు చూస్తున్నాము అని పురందేశ్వరి పేర్కొన్నారు.
Read Also: Laddu Chori: చార్మినార్ వద్ద వినాయకుని లడ్డూ మిస్సింగ్.. స్కూల్ కెళ్ళాల్సినోళ్ళు ఏం పనుల్రా అవి?
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి వైసీపీ ప్రభుత్వం నెట్టేస్తోంది అని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మేశామని, ఉద్యోగుల భవిష్య నిధిని తరలించేశామని ఆర్ధిక మంత్రి చెప్పగలిగారా.. నాణ్యత లేని మద్యం తాగించి తద్వారా వచ్చిన ఆదాయాన్ని దోచుకుంటున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తుపై భయంతో యువత ఏపీ నుంచి తరలిపోతున్నారు.. సమాజంలో జరుగుతోన్న పరిణామాలను, వాస్తవ విషయాలను అందించడంలో సోషల్ మీడియాకు ప్రధాన భూమికి ఉంది.. మహిళా రిజర్వేషన్ బిల్లు మాది అని కొందరుమాట్లాడుతున్నారు.. అప్పట్లోనే చట్టంగా ఎందుకు చేయలేదు అని పురందేశ్వరి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!