Laddu Chori: చార్మినార్ వద్ద వినాయకుని లడ్డూ మిస్సింగ్.. స్కూల్ కెళ్ళాల్సినోళ్ళు ఏం పనుల్రా అవి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laddu Chori: దేశంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండపాలలో కొలువైన వినాయకుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడికి అంత ప్రాధాన్యత ఇస్తారు. వినాయకుడితో పాటు ఆయన చేతిలో పెట్టిన లడ్డూను కూడా నవరాత్రులలో పూజిస్తారు. ఆ లడ్డూను కూడా నవరాత్రుల చివరి రోజున వేలం వేస్తారు. లడ్డూలు పొందిన వారిని భక్తులు అదృష్టవంతులుగా భావిస్తారు. లడ్డూలు పొందిన కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల నమ్ముతారు. అయితే వినాయకుడి చేతిలో వున్న లడ్డూని కొందరు విద్యార్థులు దొంగలించడం కలకలం రేపుతోంది. చార్మినార్ లోని ఘాన్సీ బజార్ గణేష్ మండపంలో చోటుచేసుకుంది.
Read also: Skanda : థమన్ ను తెగ పొగిడేసిన హీరో రామ్..
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
చార్మినార్లోని గణేష్ మండపంలో లడ్డూ చోరీకి గురైంది. పాఠశాల విద్యార్థులు దాదాపు 21 కిలోల లడ్డూలు మోసుకెళ్లడం కలకలం రేపుతోంది. ఘాన్సీ బజార్ గణేష్ మండపంలో కొందరు పాఠశాల విద్యార్థులు 21 కిలోల లడ్డూలను ఎత్తారు. ఈ విషయమై గణేష్ మండపం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండపం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల నుంచి వెళ్తున్న విద్యార్థులుగా గణేష్ మండపం వద్ద వెళుతూ కనిపించారు. తరువాత ఆ ఇద్దరు విద్యార్థులకు ఎదురుగా మరో విద్యార్థి వచ్చాడు. ఆతరువాత ఇంకో విద్యార్థు సైకిల్ వేసుకుని వచ్చాడు. విద్యార్థులందరూ ఒకరొనొక ఆ మండపంలో ఎవరూ లేరని మట్లాడుకున్నారు. గణేష్ మండపంలో ఒక్కొక్కరూ సైలెంట్ గా లోపలికి వెళ్లారు.
అక్కడి నుంచి వెళ్లేవారు కూడా పిల్లలను పట్టించుకోలేదు. దేవునికి దండం పెట్టేందుకు లోపలికి వెళుతున్నట్లు ఆలోచించి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. అయితే మండపంలోకి వెళ్లిన విద్యార్థులు వినాయకుడి చేతిలో వున్న 21కిలోల లడ్డూను తీసుకుని తిన్నారు. మళ్లీ ఏమీ తెలియనట్లు బయటకు ఒక్కొక్కరు వచ్చేశారు. ఒకరినొకరు చేయి చేయి కలుపుకుని నవ్వుకుంటూ మెల్లగా జారుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీన్ని పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. దొంగతనం చేసిన వాళ్లందరూ మైనర్లు కావడంతో వారు ఎక్కడి నుంచి వచ్చారు ? ఏ స్కూల్ కు చెందినవారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Union Minister in AP: నేడు ఏపీలో ఇద్దరు కేంద్రమంత్రుల పర్యటన
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..