Laddu Chori: చార్మినార్ వద్ద వినాయకుని లడ్డూ మిస్సింగ్.. స్కూల్ కెళ్ళాల్సినోళ్ళు ఏం పనుల్రా అవి?
Laddu Chori: దేశంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండపాలలో కొలువైన వినాయకుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడికి అంత ప్రాధాన్యత ఇస్తారు. వినాయకుడితో పాటు ఆయన చేతిలో పెట్టిన లడ్డూను కూడా నవరాత్రులలో పూజిస్తారు. ఆ లడ్డూను కూడా నవరాత్రుల చివరి రోజున వేలం వేస్తారు. లడ్డూలు పొందిన వారిని భక్తులు అదృష్టవంతులుగా భావిస్తారు. లడ్డూలు పొందిన కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల నమ్ముతారు. అయితే వినాయకుడి చేతిలో వున్న లడ్డూని కొందరు విద్యార్థులు దొంగలించడం కలకలం రేపుతోంది. చార్మినార్ లోని ఘాన్సీ బజార్ గణేష్ మండపంలో చోటుచేసుకుంది.
Read also: Skanda : థమన్ ను తెగ పొగిడేసిన హీరో రామ్..
Also Read
- Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
- Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..
- DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
- TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
చార్మినార్లోని గణేష్ మండపంలో లడ్డూ చోరీకి గురైంది. పాఠశాల విద్యార్థులు దాదాపు 21 కిలోల లడ్డూలు మోసుకెళ్లడం కలకలం రేపుతోంది. ఘాన్సీ బజార్ గణేష్ మండపంలో కొందరు పాఠశాల విద్యార్థులు 21 కిలోల లడ్డూలను ఎత్తారు. ఈ విషయమై గణేష్ మండపం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండపం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల నుంచి వెళ్తున్న విద్యార్థులుగా గణేష్ మండపం వద్ద వెళుతూ కనిపించారు. తరువాత ఆ ఇద్దరు విద్యార్థులకు ఎదురుగా మరో విద్యార్థి వచ్చాడు. ఆతరువాత ఇంకో విద్యార్థు సైకిల్ వేసుకుని వచ్చాడు. విద్యార్థులందరూ ఒకరొనొక ఆ మండపంలో ఎవరూ లేరని మట్లాడుకున్నారు. గణేష్ మండపంలో ఒక్కొక్కరూ సైలెంట్ గా లోపలికి వెళ్లారు.
అక్కడి నుంచి వెళ్లేవారు కూడా పిల్లలను పట్టించుకోలేదు. దేవునికి దండం పెట్టేందుకు లోపలికి వెళుతున్నట్లు ఆలోచించి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. అయితే మండపంలోకి వెళ్లిన విద్యార్థులు వినాయకుడి చేతిలో వున్న 21కిలోల లడ్డూను తీసుకుని తిన్నారు. మళ్లీ ఏమీ తెలియనట్లు బయటకు ఒక్కొక్కరు వచ్చేశారు. ఒకరినొకరు చేయి చేయి కలుపుకుని నవ్వుకుంటూ మెల్లగా జారుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీన్ని పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. దొంగతనం చేసిన వాళ్లందరూ మైనర్లు కావడంతో వారు ఎక్కడి నుంచి వచ్చారు ? ఏ స్కూల్ కు చెందినవారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Union Minister in AP: నేడు ఏపీలో ఇద్దరు కేంద్రమంత్రుల పర్యటన
తాజావార్తలు
-
CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
-
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
-
Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
-
Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!