Punjab Kings: ఈ సారి ఎలాగైనా ట్రోఫీ గెలవాల్సిందే.. స్పెషల్ పూజలు చేసిన ‘పంజాబ్ కింగ్స్’ టీం..!
- ఐపీఎల్ 2026 ముందు పంజాబ్ కింగ్స్ ప్రత్యేక పూజలు
- న్యూ చండీగఢ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కార్యక్రమం
- కోచ్ రికీ పాంటింగ్ సహా కోచింగ్ స్టాఫ్ హాజరు
- జట్టు విజయానికి ఆశీర్వాదాలు తీసుకున్న ఆటగాళ్లు
- మార్కస్ స్టోయినిస్, కూపర్ కానోలీ జట్టులో చేరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Kings: ఈ సారి ఎలాగైనా ట్రోఫీని గెలవాల్సిందే అన్నట్లుగా పంజాబ్ కింగ్స్ (PBKS) ఐపీఎల్ 2026 సీజన్కు ముందు న్యూ చండీగఢ్ లోని న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పూజలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీం ప్రధాన కోచ్ రికీ పాంటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే, వికెట్ కీపింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ పాల్గొన్నారు. ఐపీఎల్ 2026 సీజన్ విజయవంతంగా సాగాలని జట్టు సభ్యులు ఆశీర్వాదాలు పొందారు.
Real Estate Fraud: హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో భారీ స్కామ్.. సబ్ రిజిస్ట్రార్ అండతో రూ.15 కోట్ల మోసం!
Also Read
- Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
- IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
- Trump-Meloni: ‘ఆమె అంటే ఇష్టం.. కానీ తప్పు చేసింది’.. టర్కీ టూర్లో మెలోనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Indonesia: ‘నా డీఎన్ఏలో భారతీయ రక్తం ఉంది’.. ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు
ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మార్కస్ స్టోయినిస్, కూపర్ కానోలీ అధికారికంగా పంజాబ్ కింగ్స్ జట్టులో చేరారు. బుధవారం మొహాలీకి చేరుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టుతో కలిశారు. న్యూ చండీగఢ్ స్టేడియంలో వారికి ఘన స్వాగతం లభించింది. ఈ ఇద్దరి రాకతో జట్టుకు అంతర్జాతీయ అనుభవం, యువ ఉత్సాహం కలిసిన బలం వచ్చినట్లైంది. 2025 ఐపీఎల్ సీజన్లో రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు గత కొన్ని వారాలుగా కఠినంగా శిక్షణ తీసుకుంటోంది. తమ తొలి మ్యాచ్ను గుజరాత్ జెయింట్స్ జట్టుతో మార్చి 31న ఆడనుంది.
శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్కు చేరుకున్నప్పటికీ, రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో RCB 18 ఎల్లా తర్వాత మోదసారి ట్రోపిని ముద్దాడింది. ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేసి 190 పరుగులు చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ 43 పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్ కూడా కీలకంగా రాణించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్ 30 బంతుల్లో 61 పరుగులు చేసినప్పటికీ, ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.
Araku M*urder: యువతి విషయంలో మొదలైన గొడవ.. చివరకి ప్రాణం బలి..!
పంజాబ్ కింగ్స్ జట్టు (ఐపీఎల్ 2026):
అర్ష్దీప్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్నూర్ పన్ను, హర్ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గుసన్, మార్కో జాన్సెన్, మార్కస్ స్టోయినిస్, మిచ్ ఓవెన్, ముషీర్ ఖాన్, నేహల్ వధేరా, ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, పైలా అవినాష్, శశాంక్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్జే, విష్ణు వినోద్, వ్యషాక్ విజయ్కుమార్, జేవియర్ బార్ట్లెట్, యశ్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కూపర్ కానోలీ, ప్రవీణ్ దుబే, విశాల్ నిషాద్, బెన్ ద్వార్షుయిస్.
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!