Punjab Kings: ఈ సారి ఎలాగైనా ట్రోఫీ గెలవాల్సిందే.. స్పెషల్ పూజలు చేసిన ‘పంజాబ్ కింగ్స్’ టీం..!
- ఐపీఎల్ 2026 ముందు పంజాబ్ కింగ్స్ ప్రత్యేక పూజలు
- న్యూ చండీగఢ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కార్యక్రమం
- కోచ్ రికీ పాంటింగ్ సహా కోచింగ్ స్టాఫ్ హాజరు
- జట్టు విజయానికి ఆశీర్వాదాలు తీసుకున్న ఆటగాళ్లు
- మార్కస్ స్టోయినిస్, కూపర్ కానోలీ జట్టులో చేరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Kings: ఈ సారి ఎలాగైనా ట్రోఫీని గెలవాల్సిందే అన్నట్లుగా పంజాబ్ కింగ్స్ (PBKS) ఐపీఎల్ 2026 సీజన్కు ముందు న్యూ చండీగఢ్ లోని న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పూజలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీం ప్రధాన కోచ్ రికీ పాంటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే, వికెట్ కీపింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ పాల్గొన్నారు. ఐపీఎల్ 2026 సీజన్ విజయవంతంగా సాగాలని జట్టు సభ్యులు ఆశీర్వాదాలు పొందారు.
Real Estate Fraud: హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో భారీ స్కామ్.. సబ్ రిజిస్ట్రార్ అండతో రూ.15 కోట్ల మోసం!
Also Read
- Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మార్కస్ స్టోయినిస్, కూపర్ కానోలీ అధికారికంగా పంజాబ్ కింగ్స్ జట్టులో చేరారు. బుధవారం మొహాలీకి చేరుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టుతో కలిశారు. న్యూ చండీగఢ్ స్టేడియంలో వారికి ఘన స్వాగతం లభించింది. ఈ ఇద్దరి రాకతో జట్టుకు అంతర్జాతీయ అనుభవం, యువ ఉత్సాహం కలిసిన బలం వచ్చినట్లైంది. 2025 ఐపీఎల్ సీజన్లో రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు గత కొన్ని వారాలుగా కఠినంగా శిక్షణ తీసుకుంటోంది. తమ తొలి మ్యాచ్ను గుజరాత్ జెయింట్స్ జట్టుతో మార్చి 31న ఆడనుంది.
శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్కు చేరుకున్నప్పటికీ, రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో RCB 18 ఎల్లా తర్వాత మోదసారి ట్రోపిని ముద్దాడింది. ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేసి 190 పరుగులు చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ 43 పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్ కూడా కీలకంగా రాణించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్ 30 బంతుల్లో 61 పరుగులు చేసినప్పటికీ, ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.
Araku M*urder: యువతి విషయంలో మొదలైన గొడవ.. చివరకి ప్రాణం బలి..!
పంజాబ్ కింగ్స్ జట్టు (ఐపీఎల్ 2026):
అర్ష్దీప్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్నూర్ పన్ను, హర్ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గుసన్, మార్కో జాన్సెన్, మార్కస్ స్టోయినిస్, మిచ్ ఓవెన్, ముషీర్ ఖాన్, నేహల్ వధేరా, ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, పైలా అవినాష్, శశాంక్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్జే, విష్ణు వినోద్, వ్యషాక్ విజయ్కుమార్, జేవియర్ బార్ట్లెట్, యశ్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కూపర్ కానోలీ, ప్రవీణ్ దుబే, విశాల్ నిషాద్, బెన్ ద్వార్షుయిస్.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!