Araku M*urder: యువతి విషయంలో మొదలైన గొడవ.. చివరకి ప్రాణం బలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Araku Murder: అతడికి ఇదివరకే పెళ్లయింది.. పండంటి కాపురానికి గుర్తుగా భార్య గర్భవతి అయింది.. కొద్ది రోజుల్లో పాపో, బాబో పుట్టబోతున్నడు. కానీ అతనికి ఉన్న పాడు అలవాటు ప్రాణల మీదకి తెచ్చింది. ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అల్లూరి జిల్లా అరకులో జరిగింది.
IPL 2026: గాయాల దెబ్బకు కొత్త ప్లేయర్లు, కొత్త ఆశలు.. KKR లోకి సైనీ, GT లోకి కేజ్రోలియా..!
Also Read
- Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
- Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
- Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
- Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
ప్రశాంతంగా ఉండే అల్లూరి జిల్లా అరకు లోయ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. స్థానికంగా ఉన్న ఓ రిసార్టులో అత్యంత దారుణంగా మర్డర్ జరిగింది. ఓ యువతితో రిసార్ట్కు వచ్చిన యువకుడిని దారుణంగా హత్య చేశారు పోకిరీలు. యువతి విషయంలో మొదలైన గొడవ కాస్తా.. హత్యకు దారి తీసింది. ప్రశాంతమైన అరకులోయలో ఓ వ్యక్తి రక్తపు మడుగులో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడిని విజయనగరం జిల్లా తెర్లాం మండలం జన్నివలస గ్రామానికి చెందిన నాగెళ్ల సురేశ్ గా గుర్తించారు. అతనికి గతేడాది వివాహం జరిగింది. అతని భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. గతంలో ఇదే అరకులో రిసార్టులో పని చేశాడు. కొద్దిరోజుల తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ లోని లలిత జ్యువెలరీ షాప్ లో ఉద్యోగానికి వెళ్లాడు.
సెలవు మీద హైదరాబాద్ నుంచి అరకు వచ్చిన సురేష్ తనతో పాటు ఓ యువతిని రిసార్ట్కు తీసుకొచ్చాడు. సదరు యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు రిసార్ట్ వద్ద కొందరు పొకిరీ యువకులు. తాను తీసుకొచ్చిన యువతితో యువకులు అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు సురేష్. దీంతో మాటామాటా పెరిగి సురేష్పై దాడికి దిగారు ప్రత్యర్ధులు. పిడి గుద్దులతో రెచ్చిపోయారు. హెల్మెట్ తో తలపై కొట్టారు. అనంతరం కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా రిసార్టు ప్రాంతంలో అంతా ఉద్రిక్తంగా మారింది. మర్డర్ చేసిన తర్వాత యువకులు అక్కడి నుంచి పారిపోయారు.
రిసార్ట్ వద్ద హత్య జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సురేష్ డెడ్బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. అలాగే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మర్డర్పై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
RCB vs GT: వర్షం వల్ల క్వాలిఫయర్-1 రద్దయితే ఫైనల్ చేరేది ఎవరు.! రూల్స్ ఏమంటున్నాయంటే.?
-
AP Government: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. బిజినెస్ రూల్స్ మార్పులకు సీఎం ఆదేశాలు
-
Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ రిలీజ్.. సమంత పవర్ఫుల్ యాక్షన్ హైలైట్
-
Astrology: మే 26 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?