Araku M*urder: యువతి విషయంలో మొదలైన గొడవ.. చివరకి ప్రాణం బలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Araku Murder: అతడికి ఇదివరకే పెళ్లయింది.. పండంటి కాపురానికి గుర్తుగా భార్య గర్భవతి అయింది.. కొద్ది రోజుల్లో పాపో, బాబో పుట్టబోతున్నడు. కానీ అతనికి ఉన్న పాడు అలవాటు ప్రాణల మీదకి తెచ్చింది. ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అల్లూరి జిల్లా అరకులో జరిగింది.
IPL 2026: గాయాల దెబ్బకు కొత్త ప్లేయర్లు, కొత్త ఆశలు.. KKR లోకి సైనీ, GT లోకి కేజ్రోలియా..!
Also Read
- Delhi: పెళ్లైన రెండు నెలలకే నవవధువు మృతి.. మిస్టరీగా ఆకృతి మరణం..
- Wife Kills Husband: ‘‘ఇంట్లోకి రావొద్దు’’.. బాత్రూమ్ హత్య కేసులో సంచలన విషయాలు..
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
ప్రశాంతంగా ఉండే అల్లూరి జిల్లా అరకు లోయ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. స్థానికంగా ఉన్న ఓ రిసార్టులో అత్యంత దారుణంగా మర్డర్ జరిగింది. ఓ యువతితో రిసార్ట్కు వచ్చిన యువకుడిని దారుణంగా హత్య చేశారు పోకిరీలు. యువతి విషయంలో మొదలైన గొడవ కాస్తా.. హత్యకు దారి తీసింది. ప్రశాంతమైన అరకులోయలో ఓ వ్యక్తి రక్తపు మడుగులో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడిని విజయనగరం జిల్లా తెర్లాం మండలం జన్నివలస గ్రామానికి చెందిన నాగెళ్ల సురేశ్ గా గుర్తించారు. అతనికి గతేడాది వివాహం జరిగింది. అతని భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. గతంలో ఇదే అరకులో రిసార్టులో పని చేశాడు. కొద్దిరోజుల తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ లోని లలిత జ్యువెలరీ షాప్ లో ఉద్యోగానికి వెళ్లాడు.
సెలవు మీద హైదరాబాద్ నుంచి అరకు వచ్చిన సురేష్ తనతో పాటు ఓ యువతిని రిసార్ట్కు తీసుకొచ్చాడు. సదరు యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు రిసార్ట్ వద్ద కొందరు పొకిరీ యువకులు. తాను తీసుకొచ్చిన యువతితో యువకులు అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు సురేష్. దీంతో మాటామాటా పెరిగి సురేష్పై దాడికి దిగారు ప్రత్యర్ధులు. పిడి గుద్దులతో రెచ్చిపోయారు. హెల్మెట్ తో తలపై కొట్టారు. అనంతరం కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా రిసార్టు ప్రాంతంలో అంతా ఉద్రిక్తంగా మారింది. మర్డర్ చేసిన తర్వాత యువకులు అక్కడి నుంచి పారిపోయారు.
రిసార్ట్ వద్ద హత్య జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సురేష్ డెడ్బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. అలాగే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మర్డర్పై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!