Bhagawant Mann-meets-Kcr: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో సీఎం కేసీఆర్ భేటీ
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత జాతీయ స్థాయి నేతలతో సీఎం కేసీఆర్ భేటీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం సాయంత్రం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో దేశంలోని ప్రస్తుత రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చించారని సమాచారం. పలు కార్యక్రమాల నిమిత్తం ఇవాళ మధ్యాహ్నం సీఎం భగవంత్ మాన్ హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు.
భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ఢిల్లీలో ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి పలు రాష్ట్రాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు, రైతు సంఘాల నేతలు కేసీఆర్తో సమావేశమవుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు, పథకాలు, ఇతర అంశాలపై చర్చించారు. బీజేపీపై పోరాటం విషయంలో కేసీఆర్కు పలువురు నేతలు మద్దతు తెలుపుతున్నారు. ఆప్ నేతలు కూడా కేసీఆర్ కు బాసటగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే.. 24న పంజాబ్ స్పీకర్ సర్దార్ కుల్తార్సింగ్ సంధ్వాన్ తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్కు రానున్నారు.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
Read Also: Harsimrat Badal: మా సీఎం తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నారు.. అకాలీదళ్ ఎంపీ సంచలన ఆరోపణలు
ఈ నెలలోనే బిఆర్ఎస్ విధి విధానాలు ప్రకటన రానుందని తెలుస్తోంది. ఈ నెలాఖరులో ఢిల్లీలో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. క్రిస్మస్ తర్వాత దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయి. ఈ నెలాఖరు కెల్లా 6 రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి భారత రాష్ట్ర కిసాన్ సమితి (బీఆర్ఎస్ కిసాన్ సెల్). మహారాష్ట్ర, కర్నాటక, ఒడిసా సహా పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కిశాన్ సెల్ కమిటీలు ఏర్పాటవుతాయి.
Read Also: Special Millet Lunch: పార్లమెంట్లో ప్రత్యేక మిల్లెట్ లంచ్.. ఖర్గేతో కలిసి ఆస్వాదించిన ప్రధాని
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!