Special Millet Lunch: పార్లమెంట్లో ప్రత్యేక మిల్లెట్ లంచ్.. ఖర్గేతో కలిసి ఆస్వాదించిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Special Millet Lunch in Parliament: అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం(మిల్లెట్ ఇయర్) 2023ని పురస్కరించుకుని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఏర్పాటు చేసిన లంచ్లో తోటి పార్లమెంటు సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆనందించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. భోజనం చేస్తున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పక్కన వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూర్చున్నారు. ఈ తృణధాన్యాల భోజనం( మిల్లెట్ లంచ్) గురించి ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. 2023ని అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్గా సిద్ధమవుతున్న తరుణంలో, పార్లమెంట్లో మిల్లెట్ వంటకాలు వడ్డించే విలాసవంతమైన మధ్యాహ్న భోజనానికి హాజరయ్యామన్నారు. పార్టీలకు అతీతంగా ఈ భోజనంలో పాల్గొనడం బాగుందన్నారు.
తాము రోటీ, జ్వార్ బజ్రా, రాగులతో తయారు చేసిన స్వీట్లతో సహా రుచికరమైన వంటకాలను తయారు చేసామని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్లడించారు. దీని కోసం ప్రత్యేకంగా కర్ణాటక నుంచి చెఫ్లను రప్పించామన్నారు. ప్రధాని ఇక్కడ తన భోజనాన్ని నిజంగా ఆస్వాదించినందుకు తాను చాలా సంతోషించాననని ఆమె చెప్పారు. ఈ రోజు తయారుచేసిన రుచికరమైన వంటకాల్లో మిల్లెట్, రాగి దోస, రాగి రోటీ, జోవర్ రోటీ, హల్దీ సబ్జీ, బజ్రా, చుర్మాతో చేసిన ఖిచ్డీ ఉన్నాయి. తీపి రుచికరమైన వాటిలో బజ్రా ఖీర్, బజ్రా కేక్ కూడా ఉన్నాయి.
Also Read
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
- Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
Population Census: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులాల వారీగా జనగణన జరగలేదు
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్ 2023 వేడుకలపై ఉద్ఘాటించారు. మిల్లెట్ ద్వారా కొనసాగుతున్న పోషకాహార ప్రచారాన్ని ప్రోత్సహించడానికి మార్గాలను సూచించారు.ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం ఏప్రిల్ 2018లో మిల్లెట్ను పోషకమైన తృణధాన్యంగా నోటిఫై చేసింది. పోషన్ మిషన్ ప్రచారంలో మిల్లెట్ కూడా చేర్చబడింది.
జాతీయ ఆహార భద్రతా మిషన్ (NFMS) కింద 14 రాష్ట్రాల్లోని 212 జిల్లాల్లో మిల్లెట్లతో తయారు చేయబడిన పోషకాహారంగా అందజేయపడుతోంది. భారతదేశం, నైజర్, సూడాన్, నైజీరియా మిల్లెట్ ప్రధాన ఉత్పత్తిదారులు. భారతదేశంలోని చాలా రాష్ట్రాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ తృణధాన్యాల పంట జాతులను పండిస్తాయి. గత 5 సంవత్సరాలలో, మన దేశం 2020-21లో అత్యధిక ఉత్పత్తితో 13.71 నుండి 18 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ మిల్లెట్ను ఉత్పత్తి చేసింది.
As we prepare to mark 2023 as the International Year of Millets, attended a sumptuous lunch in Parliament where millet dishes were served. Good to see participation from across party lines. pic.twitter.com/PjU1mQh0F3
— Narendra Modi (@narendramodi) December 20, 2022
తాజావార్తలు
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Akkineni Nagarjuna : అఖిల్కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
ట్రెండింగ్
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!