Dead Body In Truck: లారీలో డెడ్ బాడీ.. షాక్కు గురైన ఓనర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dead Body In Truck: పుణెలోని లోనికండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ లారీ డ్రైవర్ల మధ్య చెలరేగిన వివాదం హత్యకు దారితీసింది. ట్రక్కులో కుళ్లిపోయిన స్థితిలో ట్రక్కు డ్రైవర్ మృతదేహాన్ని చూసిన ఓ డ్రైవర్ భయపడిపోయి ఫోన్ చేసి లారీ యజమానికి సమాచారం అందించాడు. అనంతరం ట్రక్కు యజమాని క్యాబిన్లోకి వెళ్లి చూడగా హత్య ఘటన వెలుగు చూసింది. హత్యకు గురైన డ్రైవర్ పేరు షాజద్ అబ్దుల్క్యూమ్ అహ్మద్ (26). ఈ కేసులో ప్రధాన నిందితుడైన షంషుల్ అలీ అహ్మద్ ఖాన్ (ఉత్తరప్రదేశ్) హత్య కేసులో అరెస్టయ్యాడు. ఈ విషయమై సంజయ్ కలిరమణ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
Read Also: Snake In Toilet : అర్జంట్గా టాయిలెట్కి వెళ్లాల్సి వచ్చింది.. డోర్ ఓపెన్ చేయగానే షాక్
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
లోనికండ్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గజానన్ పవార్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఫిర్యాదుదారుడు కలిరమణకు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉంది. వీరి ట్రక్కులో షాజాద్, షంషుల్ అనే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. తెలంగాణ నుంచి పుణెకు వస్తుండగా జనవరి 25 అర్ధరాత్రి పూణే ప్రాంతంలోని లోనికల్భోర్ వద్ద వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇందులో షంషుల్ అలీ అహ్మద్ ఖాన్.. షాజద్ అబ్దుల్క్యూమ్ అహ్మద్ ను గొంతు నులిమి చంపాడు. గొడవ జరిగిన సమయంలో, షంషుల్ తనను తాను రక్షించుకోవడానికి షాజాద్ను తలపై కొట్టాడు. షాజాద్ కింద పడిన తర్వాత కూడా తలపై రెండు మూడు సార్లు కొట్టి దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం షంషుల్ అక్కడి నుంచి పరారయ్యాడు.
Read Also: Heavy Rains : న్యూజిలాండ్ను ముంచెత్తిన వర్షాలు.. విమాన సర్వీసులు రద్దు
లారీ యజమాని కాళీరమణకు డ్రైవర్లిద్దరి నుంచి కాల్స్ రావడం లేదు. జనవరి 26 సాయంత్రం ఒక ట్రక్ డ్రైవర్ వారికి ఫోన్ చేయడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చారు. షాజాద్ చనిపోయినట్లు గుర్తించి, లోనికల్భోర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా షంషుల్ను అదుపులోకి తీసుకున్నారు. షంషుల్ను అదుపులోకి తీసుకున్న తర్వాత, విచారణలో, అతను ఏదో వ్యాపారం కోసం నాసిక్లో దిగినట్లు చెప్పాడు. ఇదిలా ఉండగా, పోలీసులు సాంకేతిక దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, తులాపూర్-లోనికండ్ మధ్య లారీలో ఇద్దరూ ఉన్నట్లు గుర్తించారు. దీంతో షంషుల్ నేరం అంగీకరించాడు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!