Puducherry: గుడ్ న్యూస్.. ఆడపిల్ల పుడితే రూ. 50వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
50,000 Fixed Deposit to Parents of Girl Child: పుదుచ్చేరి ప్రభుత్వం ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆడ పిల్లలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం పెద్ద పథకాన్నే ప్రవేశపెట్టింది. ఇటీవల ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వాలన్ని మహిళల ఓట్లపై దృష్టి పెట్టాయి. వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. మహిళల ఓటు బ్యాంకు పురుషులతో సమానంగా ఉండటంతో వారి ఓట్లు చాలా ముఖ్యమని పార్టీలు భావిస్తున్నాయి. అందకే అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో మహిళల కోసం అనేక పథకాలు పెడుతున్నాయి.
Also Read: Monday : శ్రావణమాసం లో సోమవారం ఇలా చేస్తే.. మీరు పట్టిందల్లా బంగారమే..
Also Read
ఇక తాజాగా ఆడబిడ్డల కోసం అద్భుతమైన పథకాన్ని ప్రవేశ పెట్టింది పుదుచ్చేరి ప్రభుత్వం. ఆడపిల్లను కంటే వారి పేరిట బ్యాంకు ఖాతా తెరచి అందుకలో రూ.50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మార్చి 17న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం రంగస్వామి ఈ ప్రకటన చేశారు. బాలికా శిశు రక్షణ పథకం కింద ఈ డబ్బు జమ చేస్తారు. కనీసం ఇలాగైనా భ్రూణ హత్యలు ఆగుతాయని ఆయన ఆకాంక్షించారు.
ఆడపిల్లపై వివక్ష తగ్గుతుందన్నారు. ఇక ఈ పథకం ప్రకటించిన తరువాత జన్మించిన 38 మంది ఆడ శిశువులకు బ్యాంకు ఖాతా తెరచి అందులో రూ.50 వేలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి ఆ పత్రాలను వారి తల్లికి అందజేశారు. ఇక దీనితో పాటు మహిళలకు అనేక పథకాలను అందిస్తుంది పుదుచ్చేరి ప్రభుత్వం. పేద మహిళలకు నెల నెలా రూ.1000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఇటీవలే మరికొంతమందికి కొత్తగా ఆర్థిక సాయం అందించారు. వారికి గుర్తింపు కార్డులను అందించారు సీఎం రంగస్వామి. దాదాపు 1600 మంది కొత్త లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు. ఇప్పటికే 13వేలమంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇక ఆడపిల్లల ఖాతాలో డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని తిలాసుకోట్టైలోని సీఎం నివాసంలో రంగస్వామి ప్రారంభించారు.
తాజావార్తలు
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. ‘వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’!
-
HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
-
HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
-
Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
-
Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!