PSL 2026: వార్నర్, స్మిత్ బ్యాట్ పడితే బాంబులు పేలుస్తాం! పీఎస్ఎల్ను వణికిస్తున్న ఉగ్రవాదుల ప్రకటన..
- పీఎస్ఎల్ 2026పై ఉగ్ర నీడ
- వార్నర్, స్మిత్లకు డెత్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSL 2026: మరో మూడు రోజుల్లో ప్రారంభం కావాల్సిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్ను ఉగ్రవాదుల భయం వణికిస్తోంది. పాకిస్థాన్లో క్రియాశీలంగా ఉన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్’ (TTP)కి చెందిన జమాత్-ఉల్-అహ్రార్ విభాగం డైరెక్ట్గా విదేశీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక సీనియర్ కమాండర్ పేరుతో విడుదలైన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
READ ALSO: Project Hail Mary: ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ కోసం హృతిక్ రోషన్
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
వార్నర్, స్మిత్లకు ప్రత్యక్ష హెచ్చరికలు..
ఈసారి పీఎస్ఎల్లో ఆస్ట్రేలియా దిగ్గజాలు డేవిడ్ వార్నర్ (కరాచీ కింగ్స్ కెప్టెన్), స్టీవ్ స్మిత్ (ముల్తాన్ సుల్తాన్స్) వంటి స్టార్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన తాజా ప్రకటనలో వీరిద్దరి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించడం క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. “మీ ఆటగాళ్లను పాకిస్థాన్కు పంపకండి. మైదానంలో వారికి ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు” అంటూ వివిధ క్రికెట్ బోర్డులను ఉగ్రవాదులు బహిరంగంగా హెచ్చరించారు. వార్నర్, స్మిత్తో పాటు మార్నస్ లబుషేన్, మోయిన్ అలీ, డెవాన్ కాన్వే, ఆడమ్ జంపా వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఈ లీగ్లో పాల్గొంటున్నారు.
పీసీబీ సంచలన నిర్ణయం..
పరిస్థితి తీవ్రతను గమనించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అత్యవసర నిర్ణయాలు తీసుకున్నారు.. భద్రతా కారణాల దృష్ట్యా పీఎస్ఎల్ 2026 మ్యాచ్లన్నీ ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. మార్చి 26న జరగాల్సిన గ్రాండ్ ఓపెనింగ్ సెరిమనీని సైతం పీసీబీ రద్దు చేసింది. ముందుగా నిర్ణయించిన వేదికలను మార్చి, కేవలం లాహోర్, కరాచీ నగరాలకే ఈ మెగా టోర్నీని పరిమితం చేశారు. ఇదే సమయంలో మార్చి 26 నుంచి స్టార్ట్ కానున్న ఈ టోర్నీలో మొత్తం 44 మ్యాచ్లు జరగాల్సి ఉంది. అయితే, తాజా బెదిరింపుల నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు పాకిస్థాన్లో కొనసాగుతారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఇప్పటికే కొందరు ఆటగాళ్లు పీఎస్ఎల్ వదిలి ఐపీఎల్ (IPL) వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
READ ALSO: Fake IAS Officer: నిత్య పెళ్లికొడుకు బాగోతం.. నకిలీ ఐఏఎస్గా 25 సార్లు పెళ్లిళ్లు.. ఎలా చిక్కాడంటే!
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!