PSL 2026: వార్నర్, స్మిత్ బ్యాట్ పడితే బాంబులు పేలుస్తాం! పీఎస్ఎల్ను వణికిస్తున్న ఉగ్రవాదుల ప్రకటన..
- పీఎస్ఎల్ 2026పై ఉగ్ర నీడ
- వార్నర్, స్మిత్లకు డెత్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSL 2026: మరో మూడు రోజుల్లో ప్రారంభం కావాల్సిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్ను ఉగ్రవాదుల భయం వణికిస్తోంది. పాకిస్థాన్లో క్రియాశీలంగా ఉన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్’ (TTP)కి చెందిన జమాత్-ఉల్-అహ్రార్ విభాగం డైరెక్ట్గా విదేశీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక సీనియర్ కమాండర్ పేరుతో విడుదలైన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
READ ALSO: Project Hail Mary: ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ కోసం హృతిక్ రోషన్
Also Read
- 6 ఏళ్ల తర్వాత 'S' సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
వార్నర్, స్మిత్లకు ప్రత్యక్ష హెచ్చరికలు..
ఈసారి పీఎస్ఎల్లో ఆస్ట్రేలియా దిగ్గజాలు డేవిడ్ వార్నర్ (కరాచీ కింగ్స్ కెప్టెన్), స్టీవ్ స్మిత్ (ముల్తాన్ సుల్తాన్స్) వంటి స్టార్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన తాజా ప్రకటనలో వీరిద్దరి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించడం క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. “మీ ఆటగాళ్లను పాకిస్థాన్కు పంపకండి. మైదానంలో వారికి ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు” అంటూ వివిధ క్రికెట్ బోర్డులను ఉగ్రవాదులు బహిరంగంగా హెచ్చరించారు. వార్నర్, స్మిత్తో పాటు మార్నస్ లబుషేన్, మోయిన్ అలీ, డెవాన్ కాన్వే, ఆడమ్ జంపా వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఈ లీగ్లో పాల్గొంటున్నారు.
పీసీబీ సంచలన నిర్ణయం..
పరిస్థితి తీవ్రతను గమనించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అత్యవసర నిర్ణయాలు తీసుకున్నారు.. భద్రతా కారణాల దృష్ట్యా పీఎస్ఎల్ 2026 మ్యాచ్లన్నీ ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. మార్చి 26న జరగాల్సిన గ్రాండ్ ఓపెనింగ్ సెరిమనీని సైతం పీసీబీ రద్దు చేసింది. ముందుగా నిర్ణయించిన వేదికలను మార్చి, కేవలం లాహోర్, కరాచీ నగరాలకే ఈ మెగా టోర్నీని పరిమితం చేశారు. ఇదే సమయంలో మార్చి 26 నుంచి స్టార్ట్ కానున్న ఈ టోర్నీలో మొత్తం 44 మ్యాచ్లు జరగాల్సి ఉంది. అయితే, తాజా బెదిరింపుల నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు పాకిస్థాన్లో కొనసాగుతారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఇప్పటికే కొందరు ఆటగాళ్లు పీఎస్ఎల్ వదిలి ఐపీఎల్ (IPL) వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
READ ALSO: Fake IAS Officer: నిత్య పెళ్లికొడుకు బాగోతం.. నకిలీ ఐఏఎస్గా 25 సార్లు పెళ్లిళ్లు.. ఎలా చిక్కాడంటే!
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి