Fake IAS Officer: నిత్య పెళ్లికొడుకు బాగోతం.. నకిలీ ఐఏఎస్గా 25 సార్లు పెళ్లిళ్లు.. ఎలా చిక్కాడంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake IAS Officer: తానొక ఐఏఎస్ అధికారిని అని, జిల్లా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)గా పనిచేస్తున్నానని నమ్మించి ఏకంగా 25 మంది మహిళలను పెళ్లి చేసుకుని ముంచేసిన ఒక ఘరానా మోసగాడి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లా, ఇఖ్దిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లుధియత్ మొహల్లాకు చెందిన ప్రీతమ్ నిషాద్ అనే ఈ నకిలీ ఐఏఎస్ అధికారిని అరెస్టు చేసేందుకు గోరఖ్పూర్ పోలీసులు రంగంలోకి దిగారు. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PM Modi: చమురు, గ్యాస్పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
- Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
- PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
- Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
అసలు విషయం ఎలా బయటపడిందంటే..
గోరఖ్పూర్లోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబం తమ చిన్న కుమార్తెకు పెళ్లి సంబంధం వెతుకుతుండగా, ఢిల్లీలో ఉంటున్న వారి పెద్ద కుమార్తెకు ఒక కమ్యూనిటీ గ్రూప్ ద్వారా నకిలీ ఐఏఎస్ ప్రీతమ్ నిషాద్ పరిచయమయ్యాడు. తాను మాణిక్పూర్ ఎస్డీఎమ్ (SDM) గా పనిచేస్తున్నానని, తన గ్రామానికి తానే మొదటి ఐఏఎస్ అధికారిని అని నమ్మబలికాడు. తన హోదాను నిరూపించుకోవడానికి నకిలీ ఇంటర్వ్యూ వీడియోలు, రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలను పంపి వారిని బుట్టలో వేసుకున్నాడు.
బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రీతమ్ పెళ్లికి ముందు ‘భారత ప్రభుత్వం’ అని రాసి ఉన్న కారులో, ఒక సహాయకుడిని వెంటబెట్టుకుని వచ్చాడు. పెళ్లి పత్రికలను క్యాబినెట్ మంత్రులకు, ఎంపీలకు పంచాలనే నెపంతో వారి నమ్మకాన్ని చూరగొన్నాడు. 2026 మార్చి 11న అత్యంత వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి ఖర్చుల పేరుతో బాధితురాలి కుటుంబం నుంచి రూ.15 లక్షల నగదు, మొత్తం మీద రూ.30 లక్షల వరకు వసూలు చేశాడు. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ప్రీతమ్ నివాసం ఉంటున్న గ్రామం నుంచి బాధితురాలి కుటుంబానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ప్రీతమ్ ఒక పెద్ద మోసగాడని, ఇప్పటికే అతను 25 సార్లు వివాహాలు చేసుకున్నాడని, ఇది అతనికి 26వ పెళ్లి అని తెలియడంతో వారు నిర్ఘాంతపోయారు. వెంటనే ఇటావాకు వెళ్లి విచారించగా.. ఎస్డీఎమ్ అని చెప్పుకునే అతని ఇంట్లో కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదని, అంతా బూటకమని తేలింది.
బాధితుల ఫిర్యాదు మేరకు గోరఖ్పూర్ కంటోన్మెంట్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రీతమ్ సోదరి, బావలను కూడా నిందితులుగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, ఇప్పటికే ఇటావాలోని తన నివాసంలో గాలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దాక్కునే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. పక్షవాతంతో బాధపడుతున్న ఆ బాధిత తండ్రి తన కష్టార్జితాన్ని అంతా పోగొట్టుకుని, కుమార్తె జీవితం ఇలా కావడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
READ ALSO: CM Revanth Reddy: ప్రతి కుటుంబానికి భరోసా.. దేశంలో ఎక్కడా ఇలాంటి సదుపాయం లేదు
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
-
Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!