Pakistan : ‘సెకండ్ క్లాస్ పౌరసత్వం అంగీకరించబడదు’.. మరో సారి వినిపించిన పీఓకే స్వరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ప్రజలు ఇస్లామాబాద్ దురాగతాలతో విసిగిపోయారు. అనేక దశాబ్దాలుగా పాకిస్థాన్ వారిని సెకండ్ క్లాస్ హోదాతో పరిగణిస్తోంది. ముజఫరాబాద్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ.. పీఓకే రాజకీయ కార్యకర్తలు పాకిస్థాన్ సైన్యం, పాలనపై తమ ఆగ్రహం, బాధను బహిరంగంగా వ్యక్తం చేశారు. పీఓకేలో చాలా కాలంగా కొనసాగుతున్న నిరసనలకు నాయకత్వం వహిస్తున్న నాయకుడు, రాజకీయ కార్యకర్త తౌకీర్ గిలానీ మాట్లాడుతూ.. పాకిస్తాన్ నాయకులు వారు మాతో పాటు ఉంటారని.. పీఓకే పౌరుల హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాడతారని చెప్పారు. కానీ పాకిస్థాన్ ఏర్పాటైనప్పటి నుంచి పాకిస్థాన్ మనకు శత్రువుగానే మిగిలిపోయిందన్నారు.
Read Also:Meenkshi Chaudhary : అలాంటి సీన్స్ చేయడానికి సిద్దమే కానీ షరుతులు వర్తిస్తాయి..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
సహజ వనరుల సంపద పీఓకేకు అతిపెద్ద ముప్పుగా మిగిలిపోయింది. ఈ ప్రాంతాన్ని 1948 నుంచి పాకిస్థాన్ బలవంతంగా ఆక్రమించిందని గిలానీ అన్నారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాకిస్థాన్ చేస్తున్న అకృత్యాలను కూడా గిలానీ ప్రస్తావించారు. దేశానికి ఎన్నోసార్లు సేవలందించిన జాతీయ నాయకులను కూడా పాకిస్థాన్ వదిలిపెట్టలేదని ఆయన అన్నారు. దేశద్రోహిగా ప్రకటించి జైల్లో పెట్టారు. రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడంతోపాటు మన సంస్కృతులు, సంప్రదాయాలను ధ్వంసం చేయడంలో పాకిస్థాన్ పరిపాలన నిమగ్నమైందని గిలానీ అన్నారు. పాకిస్థాన్ అన్ని చోట్లా భూమిని స్వాధీనం చేసుకునేందుకు పూనుకుంది. అతను ప్రశ్నలను లేవనెత్తాడు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం.. ఇదేం ఇస్లామన్నారు. మానవజాతి చరిత్రలో ఇంతకంటే పెద్ద అబద్ధం లేదన్నారు.
Read Also:Bihar Crisis: ముఖ్యమంత్రి పదవికి నితీష్కుమార్ రాజీనామా.. నెక్ట్స్ ఏంటంటే..!
ర్యాలీని ఉద్దేశించి గిలానీ మాట్లాడుతూ.. నేడు పాకిస్తాన్ ప్రభుత్వం మా మాట వినడానికి.. మనం డిమాండ్ చేస్తున్న స్వేచ్ఛను ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఇక్కడి ప్రభుత్వం మమ్మల్ని పాకిస్థాన్ వ్యతిరేకి, ఇస్లాం వ్యతిరేకి అంటోంది. పాకిస్తాన్ ఉద్దేశం మన హక్కులను లాక్కోవడమే, కానీ పీఓకే ప్రజలు దీన్ని ఇక సహించరు. పీఓకే ప్రజలు ఇప్పుడు మరింత అవగాహన పెంచుకున్నారు. మా స్వరాన్ని పెంచడంలో వచ్చే ప్రతి అవకాశాన్ని వదులుకోమని గిలానీ అన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!