Spa Center: స్పా ముసుగులో వ్యభిచార దందా.. గుట్టురట్టు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spa Center: కొందరు వ్యక్తులు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కు తున్నారు. ఆడవాళ్లను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి డబ్బులు దండుకుంటున్నా రు. భారత్లో చాలా చోట్ల ఇలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అమాయకమైన అమ్మాయిలను తమ వలలో వేసుకుని వారిని తీసుకువచ్చి వ్యభిచార ముఠాలకు విక్రయించి అందినకాడికి డబ్బును దండుకుంటున్నారు.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని నిర్మాణ్ విహార్లోని స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచార రాకెట్ ముఠా గుట్టును అక్కడి పోలీసులు పట్టుకున్నారు. తొమ్మిది మంది మహిళలను రక్షించిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టయిన నిందితులను జిల్మిల్ కాలనీకి చెందిన రామ్ సాగర్ (24), విశ్వాస్ నగర్కు చెందిన దీపక్ (20)గా గుర్తించారు. రహస్య సమాచారం మేరకు ఈస్ట్ ఢిల్లీ, ప్రీత్ విహార్ పోలీస్ స్టేషన్కు చెందిన ప్రత్యేక సిబ్బంది బృందం దాడులు నిర్వహించడంతో ఈ రాకెట్ బయటపడింది. ఒక డెకాయ్ కస్టమర్ స్పాతో ఒప్పందం కుదుర్చుకోవడంతో, పోలీసులు పార్లర్పై దాడి చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్పా మేనేజర్ అజయ్ సింగ్ పరారీలో ఉన్నాడు.
Also Read
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
Read Also: Planes Collide: గగనతలంలో తృటిలో తప్పిన ప్రమాదం.. రెండు విమానాలు ఢీకొనబోయి..
“మొత్తం 9 మంది బాలికలు స్పాలో నిమగ్నమై ఉన్నారు. స్పాను ప్రవీణ్ అలియాస్ టిటు చౌదరి నిర్వహిస్తున్నాడు. స్పా మేనేజర్ అజయ్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి” అని డీసీపీ అమృత గుగులోత్ శనివారం తెలిపారు.స్పా అండ్ మసాజ్ సెంటర్ ముసుగులో ట్రూ బ్లిస్ స్పా, వీ3ఎస్ మాల్లో వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు మార్చి 24న పక్కా సమాచారం అందిందని పోలీసు అధికారి తెలిపారు.
“పోలీసు బృందంలోని ఒక డెకాయ్ కస్టమర్ను స్పాకు పంపారు. బేరం కుదుర్చుకుని అతని నుంచి రూ. 1,000 వసూలు చేశారు. ఆ తర్వాత అతనికి 9 మంది అమ్మాయిలను చూపించారు. వారిలో ఒకరిని ఎంపిక చేసుకోమని అడిగారు. శృంగారం కోసం కస్టమర్ నుంచి రూ. 2,000 అదనంగా వసూలు చేశారు.” అని అధికారి తెలిపారు, అప్పుడే డికాయ్ కస్టమర్ మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పోలీసు బృందానికి సిగ్నల్ ఇచ్చాడు, ఆ తర్వాత బృందం ఆవరణలో దాడి చేసి ఇద్దరు వ్యక్తులను పట్టుకుంది. గత రెండేళ్లుగా స్పా నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. “గతంలో జూలై 2022లో ఇదే స్పాపై కేసు నమోదైంది” అని పోలీసు అధికారి తెలిపారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!