Spa Center: స్పా ముసుగులో వ్యభిచార దందా.. గుట్టురట్టు చేసిన పోలీసులు
Spa Center: కొందరు వ్యక్తులు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కు తున్నారు. ఆడవాళ్లను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి డబ్బులు దండుకుంటున్నా రు. భారత్లో చాలా చోట్ల ఇలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అమాయకమైన అమ్మాయిలను తమ వలలో వేసుకుని వారిని తీసుకువచ్చి వ్యభిచార ముఠాలకు విక్రయించి అందినకాడికి డబ్బును దండుకుంటున్నారు.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని నిర్మాణ్ విహార్లోని స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచార రాకెట్ ముఠా గుట్టును అక్కడి పోలీసులు పట్టుకున్నారు. తొమ్మిది మంది మహిళలను రక్షించిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టయిన నిందితులను జిల్మిల్ కాలనీకి చెందిన రామ్ సాగర్ (24), విశ్వాస్ నగర్కు చెందిన దీపక్ (20)గా గుర్తించారు. రహస్య సమాచారం మేరకు ఈస్ట్ ఢిల్లీ, ప్రీత్ విహార్ పోలీస్ స్టేషన్కు చెందిన ప్రత్యేక సిబ్బంది బృందం దాడులు నిర్వహించడంతో ఈ రాకెట్ బయటపడింది. ఒక డెకాయ్ కస్టమర్ స్పాతో ఒప్పందం కుదుర్చుకోవడంతో, పోలీసులు పార్లర్పై దాడి చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్పా మేనేజర్ అజయ్ సింగ్ పరారీలో ఉన్నాడు.
Also Read
Read Also: Planes Collide: గగనతలంలో తృటిలో తప్పిన ప్రమాదం.. రెండు విమానాలు ఢీకొనబోయి..
“మొత్తం 9 మంది బాలికలు స్పాలో నిమగ్నమై ఉన్నారు. స్పాను ప్రవీణ్ అలియాస్ టిటు చౌదరి నిర్వహిస్తున్నాడు. స్పా మేనేజర్ అజయ్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి” అని డీసీపీ అమృత గుగులోత్ శనివారం తెలిపారు.స్పా అండ్ మసాజ్ సెంటర్ ముసుగులో ట్రూ బ్లిస్ స్పా, వీ3ఎస్ మాల్లో వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు మార్చి 24న పక్కా సమాచారం అందిందని పోలీసు అధికారి తెలిపారు.
“పోలీసు బృందంలోని ఒక డెకాయ్ కస్టమర్ను స్పాకు పంపారు. బేరం కుదుర్చుకుని అతని నుంచి రూ. 1,000 వసూలు చేశారు. ఆ తర్వాత అతనికి 9 మంది అమ్మాయిలను చూపించారు. వారిలో ఒకరిని ఎంపిక చేసుకోమని అడిగారు. శృంగారం కోసం కస్టమర్ నుంచి రూ. 2,000 అదనంగా వసూలు చేశారు.” అని అధికారి తెలిపారు, అప్పుడే డికాయ్ కస్టమర్ మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పోలీసు బృందానికి సిగ్నల్ ఇచ్చాడు, ఆ తర్వాత బృందం ఆవరణలో దాడి చేసి ఇద్దరు వ్యక్తులను పట్టుకుంది. గత రెండేళ్లుగా స్పా నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. “గతంలో జూలై 2022లో ఇదే స్పాపై కేసు నమోదైంది” అని పోలీసు అధికారి తెలిపారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
-
jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!