Spa Center: స్పా ముసుగులో వ్యభిచార దందా.. గుట్టురట్టు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spa Center: కొందరు వ్యక్తులు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కు తున్నారు. ఆడవాళ్లను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి డబ్బులు దండుకుంటున్నా రు. భారత్లో చాలా చోట్ల ఇలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అమాయకమైన అమ్మాయిలను తమ వలలో వేసుకుని వారిని తీసుకువచ్చి వ్యభిచార ముఠాలకు విక్రయించి అందినకాడికి డబ్బును దండుకుంటున్నారు.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని నిర్మాణ్ విహార్లోని స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచార రాకెట్ ముఠా గుట్టును అక్కడి పోలీసులు పట్టుకున్నారు. తొమ్మిది మంది మహిళలను రక్షించిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టయిన నిందితులను జిల్మిల్ కాలనీకి చెందిన రామ్ సాగర్ (24), విశ్వాస్ నగర్కు చెందిన దీపక్ (20)గా గుర్తించారు. రహస్య సమాచారం మేరకు ఈస్ట్ ఢిల్లీ, ప్రీత్ విహార్ పోలీస్ స్టేషన్కు చెందిన ప్రత్యేక సిబ్బంది బృందం దాడులు నిర్వహించడంతో ఈ రాకెట్ బయటపడింది. ఒక డెకాయ్ కస్టమర్ స్పాతో ఒప్పందం కుదుర్చుకోవడంతో, పోలీసులు పార్లర్పై దాడి చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్పా మేనేజర్ అజయ్ సింగ్ పరారీలో ఉన్నాడు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: Planes Collide: గగనతలంలో తృటిలో తప్పిన ప్రమాదం.. రెండు విమానాలు ఢీకొనబోయి..
“మొత్తం 9 మంది బాలికలు స్పాలో నిమగ్నమై ఉన్నారు. స్పాను ప్రవీణ్ అలియాస్ టిటు చౌదరి నిర్వహిస్తున్నాడు. స్పా మేనేజర్ అజయ్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి” అని డీసీపీ అమృత గుగులోత్ శనివారం తెలిపారు.స్పా అండ్ మసాజ్ సెంటర్ ముసుగులో ట్రూ బ్లిస్ స్పా, వీ3ఎస్ మాల్లో వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు మార్చి 24న పక్కా సమాచారం అందిందని పోలీసు అధికారి తెలిపారు.
“పోలీసు బృందంలోని ఒక డెకాయ్ కస్టమర్ను స్పాకు పంపారు. బేరం కుదుర్చుకుని అతని నుంచి రూ. 1,000 వసూలు చేశారు. ఆ తర్వాత అతనికి 9 మంది అమ్మాయిలను చూపించారు. వారిలో ఒకరిని ఎంపిక చేసుకోమని అడిగారు. శృంగారం కోసం కస్టమర్ నుంచి రూ. 2,000 అదనంగా వసూలు చేశారు.” అని అధికారి తెలిపారు, అప్పుడే డికాయ్ కస్టమర్ మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పోలీసు బృందానికి సిగ్నల్ ఇచ్చాడు, ఆ తర్వాత బృందం ఆవరణలో దాడి చేసి ఇద్దరు వ్యక్తులను పట్టుకుంది. గత రెండేళ్లుగా స్పా నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. “గతంలో జూలై 2022లో ఇదే స్పాపై కేసు నమోదైంది” అని పోలీసు అధికారి తెలిపారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!