Election Commission : ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ వేగవంతం.. మార్చి 14న సెలక్షన్ కమిటీ సమావేశం
Election Commission : ఎన్నికల సంఘం కొత్తగా ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయనున్నారు. గత నెలలో, అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండు ఎన్నికల కమిషనర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఈ పోస్టుల ఎంపిక కోసం సెలక్షన్ కమిటీ సమావేశం మార్చి 14న జరిగే అవకాశం ఉందని వర్గాలు భావిస్తున్నాయి. ముందుగా ఈ సమావేశం మార్చి 15న సాయంత్రం 6 గంటలకు జరగాల్సి ఉంది.
ఈ సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రి, లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కూడా ఉన్నారు. పాండే పదవీ విరమణ కారణంగా ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయడానికి మార్చి 7న సమావేశం జరగాల్సి ఉంది. శనివారం మధ్యాహ్నం ఎన్నికల కమిషనర్ను ఎంపిక చేసేందుకు సమావేశం నోటీసు పంపగా, సాయంత్రం గోయల్ రాజీనామా నోటిఫికేషన్ వెలువడిందని వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కోసం సవరించిన నోటీసును న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం పంపింది. శనివారం మధ్యాహ్నం ఎన్నికల కమిషనర్ను ఎంపిక చేసేందుకు సమావేశం నోటీసు పంపింది.
Also Read
- EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
- Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!
ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు గోయల్ శుక్రవారం ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆయన రాజీనామాను ఆమోదించగా, న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే సభ్యుడు.
అంతకుముందు అశోక్ లావాసా 2020 ఆగస్టులో ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై ఆయన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ మొదట రెండు పోస్టులకు ఐదు పేర్లతో రెండు వేర్వేరు ప్యానెల్లను సిద్ధం చేస్తుంది. ఈ కమిటీలో హోం సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) సెక్రటరీ ఉంటారు. ఆ తర్వాత సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కూడా ఉంటారు. ఎన్నికల కమిషనర్గా ఇద్దరు వ్యక్తుల పేర్లను నిర్ణయించనున్నారు.
Read Also:Gold Price Price : మరోసారి తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
తాజావార్తలు
-
EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
-
Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!
-
Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!