Election Commission : ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ వేగవంతం.. మార్చి 14న సెలక్షన్ కమిటీ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission : ఎన్నికల సంఘం కొత్తగా ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయనున్నారు. గత నెలలో, అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండు ఎన్నికల కమిషనర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఈ పోస్టుల ఎంపిక కోసం సెలక్షన్ కమిటీ సమావేశం మార్చి 14న జరిగే అవకాశం ఉందని వర్గాలు భావిస్తున్నాయి. ముందుగా ఈ సమావేశం మార్చి 15న సాయంత్రం 6 గంటలకు జరగాల్సి ఉంది.
ఈ సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రి, లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కూడా ఉన్నారు. పాండే పదవీ విరమణ కారణంగా ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయడానికి మార్చి 7న సమావేశం జరగాల్సి ఉంది. శనివారం మధ్యాహ్నం ఎన్నికల కమిషనర్ను ఎంపిక చేసేందుకు సమావేశం నోటీసు పంపగా, సాయంత్రం గోయల్ రాజీనామా నోటిఫికేషన్ వెలువడిందని వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కోసం సవరించిన నోటీసును న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం పంపింది. శనివారం మధ్యాహ్నం ఎన్నికల కమిషనర్ను ఎంపిక చేసేందుకు సమావేశం నోటీసు పంపింది.
Also Read
ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు గోయల్ శుక్రవారం ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆయన రాజీనామాను ఆమోదించగా, న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే సభ్యుడు.
అంతకుముందు అశోక్ లావాసా 2020 ఆగస్టులో ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై ఆయన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ మొదట రెండు పోస్టులకు ఐదు పేర్లతో రెండు వేర్వేరు ప్యానెల్లను సిద్ధం చేస్తుంది. ఈ కమిటీలో హోం సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) సెక్రటరీ ఉంటారు. ఆ తర్వాత సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కూడా ఉంటారు. ఎన్నికల కమిషనర్గా ఇద్దరు వ్యక్తుల పేర్లను నిర్ణయించనున్నారు.
Read Also:Gold Price Price : మరోసారి తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
తాజావార్తలు
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్లో
-
BRICS: బ్రిక్స్లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్కు చెక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!