ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.. గతంలో కంటే ఈ ఏడాది ఉద్యోగాలను పెంచింది.. ప్రభుత్వ సంస్థల్లో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది.. ఇప్పుడు మరో సంస్థ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ బెల్లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ద్వారా 517 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఇంజనీరింగ్ పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మార్చి 13, 2024. ఆ లోపు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ bel-india.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్ ల భర్తీకి సంబంధించిన పరీక్ష ఫిబ్రవరి నెలలో జరగనుంది.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య : 517
అర్హతలు..
బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/కమ్యూనికేషన్/మెకానికల్ /ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్-ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్ -ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
వయసు..
బీఈ/బీటెక్ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎంఈ/ఎంటెక్ అభ్యర్థులకు 30ఏళ్లు మించకూడదు.
వేతనం..
నెలకు రూ.30,000- రూ.40,000
ఎంపిక విధానం..
రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్కు చివరి తేది: 13.03.2024.
వెబ్సైట్: https://bel-india.in/ లో ఈ పోస్టుల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు..