Priyanka Gandhi : కర్ణాటకలో పాల పంచాయితీ పెట్టిన ప్రియాంక గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వస్తే నందిని బ్రాండ్ ను మరింత శక్తివంతం చేస్తుందని.. ఇతర రాష్ట్రాల నుంచి మరో కో ఆపరేటివ్ రాదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. కర్ణాటక పాల సమాఖ్య నేతృత్వంలోని నందిని పాలను గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ పాలలో విలీనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎన్నికల వేళ మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేసింది.
Also Read : Bhatti Vikramarka : కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం జనగణనను వెంటనే మొదలు పెట్టాలి
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
మైసూర్ లో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే కర్ణాటకను అభివృద్దిలో పరుగులు పెట్టిస్తామని, కర్ణాటక పాల సమాఖ్యను మరింత శక్తివంతం చేస్తామని వెల్లడించారు. కర్ణాటకలో గతంలో ఏ ప్రభుత్వం ప్రజల జీవితాలను మెరుగుపర్చిందో ఆలోచించుకుని మళ్లీ ఆ ప్రభుత్వానికే అధికారం అప్పగించాలని ప్రియాంక గాంధీ కోరారు.
Also Read : Burkina Faso: బుర్కినా ఫాసోలో నరమేధం.. 60 మంది దుర్మరణం
40 శాతం కమీషన్ తో కర్ణాటకలోని బీజేపీ సర్కార్ రూ. 1.5 లక్షల కోట్లు దోచుకుంది. ప్రజలు పేదలుగానే ఉండాలని బీజేపీ భావిస్తోంది. ఇలా ఉంటేనే ప్రజలు తమను ప్రశ్నించబోరని బీజేపీ అనుకుంటోందని ప్రియాంక గాంధీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం దోచుకున్న డబ్బుతో 100 ఎయిమ్స్ నిర్మించవచ్చు. పేద ప్రజలకు 30 లక్షల ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు.. 750 కిలో మీటర్ల మెట్రో లైన్లు వేయవచ్చు అంటూ ప్రియాంక గాంధీ విమర్శించింది. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు మద్దతు చెబుతుంది. వారి నుంచి జీఎస్టీ కూడా వసూలు చేయట్లేదు.. ప్రజలు వాడే నిత్యావసరాల నుంచే జీఎస్టీ వసూలు చేస్తోంది అని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!