Priyanka Gandhi : రూ.14లక్షల కోట్ల లోన్ తీసుకుని ఏం చేస్తారు.. ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల రుణం తీసుకోవడంపై ప్రశ్నలు సంధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం రూ. 14 లక్షల కోట్లకు పైగా రుణం తీసుకోబోతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ రుణంతో ఏం చేయబోతున్నారని అడిగారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 67 ఏళ్లలో దేశం మొత్తం అప్పు రూ.55 లక్షల కోట్లు ఉందన్నారు. గత 10 ఏళ్లలో మోడీ క్కడే దానిని రూ.205 లక్షల కోట్లకు పెంచారు. ఆ డబ్బు ఎవరి కోసం ఖర్చు చేశారని ప్రశ్నించారు. పెద్ద కోటీశ్వరుల రుణమాఫీకి ఎంత డబ్బులు వెచ్చించారని ఆరోపించారు. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం దాదాపు రూ.150 లక్షల కోట్ల రుణం తీసుకుందన్నారు. దీని ప్రకారం నేడు దేశంలోని ప్రతి పౌరుడిపై సగటున రూ.1.5 లక్షల అప్పు ఉందని ఆయన అన్నారు.
Read Also:CM YS Jagan: వైసీపీ నేతలు, కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం
Also Read
- West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
* ఈ డబ్బును దేశ నిర్మాణానికి ఏ ప్రయోజనం కోసం ఉపయోగించారు?
* ఉద్యోగాలు పెద్ద ఎత్తున సృష్టించబడ్డాయా?
* రైతుల ఆదాయం రెండింతలు పెరిగిందా?
* పాఠశాలలు, ఆసుపత్రులు వచ్చాయా ?
* ప్రభుత్వ రంగం బలపడిందా ?
* పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఏర్పాటయ్యాయా?
* బిలియనీర్ల కోసం ఎంత ఖర్చు పెట్టారు?
Read Also:Gunturu karam: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ‘గుంటూరు కారం’ డేట్ ఫిక్స్..!
ఇవన్నీ జరిగాయా.. మరి అలా జరగకపోతే తీసుకున్న డబ్బంతా ఏమైంది.. ఎవరి జేబుల్లోకి వెళ్లింది. పెద్ద కోటీశ్వరుల రుణమాఫీకి ఎంత డబ్బు ఖర్చు చేశారు? ఇప్పుడు ప్రభుత్వం కొత్త రుణం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం పెరిగిపోతుంటే సామాన్య ప్రజానీకానికి ఊరట లభించే బదులు.. బీజేపీ ప్రభుత్వం ప్రజలను మరింత అప్పుల్లోకి తోసే ప్రయత్నం చేస్తుందన్నారు.
తాజావార్తలు
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..