Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana Assembly Elections 2023 Priyanka Gandhi Comments At Bhatti Vikramarka Constituency Madhira Public Meeting

Priyanka Gandhi: ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ప్రజలు గుర్తొస్తారు

Published Date :November 25, 2023 , 5:05 pm
By snehalatha
Priyanka Gandhi: ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ప్రజలు గుర్తొస్తారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Priyanka Gandhi Comments: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మల్లు భట్టి విక్రమార్క మధీర నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘భట్టి నియోజవర్గానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. రాహుల్ తరహాలోనే భట్టి కూడా తెలంగాణలో పాదయాత్ర చేశారు.. ఇది సంతోషాన్నిస్తోంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే రాహుల్, భట్టి పాదయాత్ర చేశారు. మా అమ్మతో మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రాంతం కోసం కాంగ్రెస్ నేతలు సహా చాలా మంది పోరాడారని సోనియా నాతో చెప్పారు. తెలంగాణ కలలు సాకారం కోసం బలమైన ప్రభుత్వం రాబోతోందని సోనియా సందేశమిచ్చారు’ అని పేర్కొన్నారు.

Also Read: Wife Kills Husband: బర్త్ డే రోజు దుబాయ్‌కి తీసుకెళ్లలేదని.. భర్తను కొట్టి చంపిన భార్య..

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. నిన్న నేనో ఇంటికి వెళ్లాను.. వాళ్లతో మాట్లాడాను. అసంపూర్తిగా ఉన్న ఇల్లు చూపించి.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తానిచ్చిన హామీలను మరిచిపోయింది. ఈ ప్రభుత్వం పేదలను వదిలేసి. ధనికుల కోసమే పని చేస్తోంది. ప్రజలే ముఖ్యం.. ప్రజలే అందరిపైనా ఉంటారని మహాత్మగాంధీ మొదలుకుని కాంగ్రెస్ పార్టీ ప్రధానులందరూ అంతే అదే భావించారు. కానీ కేసీఆర్, మోదీ దీనికి విరుద్దంగా ఆలోచన చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు రుణమాఫీ అమలు చేయలేదు. కనీస మద్దతు ధర పంటలకు లభించడం లేదు. బిడ్డల భవిష్యత్ కోసం తెలంగాణ తల్లులు తల్లడితున్న పరిస్థితి ఉంది.

పేపర్ లీకేజీ ఘటనలతో బిడ్డల భవిష్యత్‌పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ బిడ్డల భవిష్యత్తుని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత కూడా లక్షల సంఖ్యలో విద్యార్థులు నిరుద్యోగులుగానే ఉన్నారు. కేసీఆర్ ఫ్యామిలీలో చాలా మందికి పదవులు వచ్చాయి. బీఆర్ఎస్ నేతలు ఫాం హౌసుల్లోనే పడుకుంటున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం భట్టి వంటి కాంగ్రెస్ నేతలు.. ప్రజల్లో తిరుగుతూ పాదయాత్రలు చేస్తున్నారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ బుద్దేంటో ప్రజలకు తెలిసిపోయింది. ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆరుకు ప్రజలు గుర్తొస్తారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి జనవరిలో చేయాల్సిన కొన్ని స్కీంలు ఇప్పుడే చేసేస్తున్నారు.

Also Read: Bhatti Vikramarka: వంద కేసీఆర్లు వచ్చినా మధిర గేటు తాకలేరు..

ఎన్నికల ముందు ఇచ్చే స్కీంలను తీసుకోండి.. కానీ ఓటేయొద్దు. పదేళ్ల నుంచి ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ప్రజలు ముందుకు వచ్చారు. కేసీఆర్ ఆడే ఆటను ప్రదలందరూ గుర్తించాలి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుతే పోటీ చేస్తోంది. బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు సహకరించుకుంటున్నాయి. ఎంఐఎం కూడా ఆ పార్టీలకే సహకరిస్తోంది. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో 50-60 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. తెలంగాణలో అన్ని స్థానాల్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదు..? బీజేపీ-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలు ఒక్కటే. భారత్ జోడో యాత్ర చేసిన రాహులును ఒవైసీ ఎందుకు విమర్శిస్తున్నారు..?’ అని ఆమె వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhatti vikramarka
  • cm kcr
  • Congress Party
  • Madhira
  • Priyanka Gandhi

తాజావార్తలు

  • MP Putta Mahesh Kumar: తప్పు చేయలేదు.. నిర్దోషిగా నిరూపించుకుంటా..

  • Whats App Chat: వాట్సాప్ చాట్ ప్రాణాల మీదకు తెచ్చింది.. ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య..

  • ONLINE GAMES : అప్పులు తీర్చే దారి లేక బలవన్మరణానికి పాల్పడ్డ అరుణ్

  • Trump: ట్రంప్ చైనా టూర్‌‌పై సందిగ్ధం.. కారణమిదేనా?

  • Hyderabad: ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ల ఆశ చూపి అత్యాచారం.. ఆపై హత్య..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions