PM Modi South Visit: నేడు సౌత్ ఇండియాలో ప్రధాని మోడీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి మూడు రాష్ట్రాల్లోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నేటి ఉదయం 10.45 గంటలకు మహారాష్ట్రలోని షోలాపూర్లో ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో దాదాపు రూ. 2,000 కోట్ల విలువైన ఎనిమిది అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 90 వేలకు పైగా ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇక, షోలాపూర్లోని రాయ్నగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన 15,000 ఇళ్లను లబ్ధిదారులకు ప్రధాని అందజేయనున్నారు. ఈ లబ్ధిదారులలో వేలాది మంది చేనేత కార్మికులు, పవర్ లూమ్ కార్మికులు, ర్యాగ్ పికర్స్, బీడీ కార్మికులతో పాటు డ్రైవర్లు ఉన్నారు.
Read Also: Guntur Kaaram: 7 రోజుల్లో 212 కోట్లు… అతన్ని ఆపగలిగే ఫోర్స్ రీజనల్ బాక్సాఫీస్ దగ్గర లేదు
Also Read
- RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
అనంతరం ప్రధాని మోడీ మధ్యాహ్నం 2:45 గంటలకు కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో అమెరికా విమానాల తయారీ కంపెనీ బోయింగ్కు చెందిన కొత్త గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రూ.1,600 కోట్లతో 43 ఎకరాల్లో నిర్మించిన అత్యాధునిక బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ (బీఐఈటీసీ) క్యాంపస్ అమెరికా వెలుపల కంపెనీ చేస్తున్న అతిపెద్ద పెట్టుబడి అని ఆయన చెప్పారు. బెంగళూరు శివార్లలోని దేవనహళ్లిలోని ఈ ‘హై-టెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్’ క్యాంపస్ ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. అత్యాధునిక ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడంలో ఇది సహాయపడుతుంది. దేశంలో అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలోకి ఎక్కువ మంది బాలికలు ప్రవేశించేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ‘బోయింగ్ సుకన్య ప్రోగ్రామ్’ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.
Read Also: Shavarma: షవర్మా తిని 17 మందికి తీవ్ర అస్వస్థత.. అల్వాల్ గ్రిల్ హౌజ్ బంద్
ఈ రెండు కార్యక్రమాలకు హాజరైన తర్వాత.. పీఎం మోడీ తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం 6 గంటలకు చెన్నైలో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మరో రెండు రోజుల పాటు (జనవరి 20 మరియు 21) ప్రధాని మోడీ తమిళనాడులోని పలు ముఖ్యమైన ఆలయాలను సందర్శించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మోడీ రామేశ్వరం వెళ్లనున్నారు. రామేశ్వరంలోని శ్రీ అరుల్మిగు రామనాథస్వామి ఆలయంలో జరిగే భజన సంధ్యలో కూడా పాల్గొంటారు. ఎల్లుండి (జనవరి 21న) ధనుష్కోడిలోని కోదండరామస్వామి ఆలయంలో ప్రధాని మోడీ పూజలు చేయనున్నారు. రామసేతు నిర్మించిన ప్రదేశంగా చెప్పబడుతున్న ధనుష్కోడి సమీపంలోని అరిచల్ మునైని కూడా మోడీ సందర్శించబోతున్నారు.
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!