PM Modi Diwali Celebrations: సైనికులతో కలిసి దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోడీ
- గుజరాత్లోని కచ్కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.
- సైనికులతో కలిసి దీపావళి సంబరాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Diwali Celebrations: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లోని కచ్కు చేరుకున్నారు. అక్కడ సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దీపావళి రోజున సైనికులతో గడపాలని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నారు. ప్రధాని మోడీ కచ్లో భారత సైనికులతో కలిసి దీపావళి జరుపుకోనున్నారు. ప్రధాని అయిన తర్వాత గుజరాత్లోని సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం ఇదే తొలిసారి. కాబట్టి, ప్రధాని మోడీకి ఈ పర్యటన ప్రత్యేకం. గతంలో ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుజరాత్ సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు.
Read Also: Raja Singh : దీపావళి పటాకుల పైన లక్ష్మీ దేవి బొమ్మ పెట్టి అమ్ముతున్నారు.. ఇదో కుట్ర : రాజాసింగ్
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
కెవడియాలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కచ్ చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ సైనికులతో గడిపి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపనున్నారు. ఆయన పర్యటన జాతీయ ఐక్యతకు, సైనికుల పట్ల గౌరవానికి ప్రతీకగా భావిస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రధాని మోడీ ఇంతకుముందు చాలాసార్లు సైనికులతో కనిపించారు. ప్రధానమంత్రి గత సంవత్సరం (2023) హిమాచల్ ప్రదేశ్ లోని సైనికులతో కలిసి వేడుకలను చేసుకున్నారు.
దీపావళి పండుగను పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ చేరుకోనున్నారు. అక్కడ భారత ఆర్మీ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. దీనికి ముందు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బుధవారం సాయంత్రం అస్సాంలోని తేజ్పూర్ చేరుకున్నారు. ఇక్కడ అతను మేఘనా స్టేడియంలో సైనిక సిబ్బందితో దీపావళిని జరుపుకున్నాడు. ఆ తర్వాత వారితో కలిసి డిన్నర్ కూడా చేశాడు. ఇకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’లో ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పవిత్ర దీపాల పండుగ సందర్భంగా, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ మాత, శ్రీ గణేషుని అనుగ్రహంతో ఆశీర్వదించబడాలని రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!