PM Modi: మహిళల రక్షకు కొత్త చట్టాలు.. ఎవ్వరినీ వదలం.. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
- మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తాం
- వారి రక్షణకు కొత్త చట్టాలు రూపొందిస్తున్నాం
- దోషులను రక్షించే వారిని కూడా వదలం
- ప్రధాని మోడీ సంచలన నిర్ణయం
మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాన్ని మరింత పటిష్ఠంగా, కఠినతరం చేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఈరోజు మహారాష్ట్ర జల్గావ్లోని లఖపతి దీదీ సదస్సులో ఏర్పాటు చేసిన సభకు మోడీ హాజరై ప్రసంగించారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో జనాల ఆగ్రహావేశాల మధ్య ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
READ MORE: Kiren Rijiju: మిస్ ఇండియాలో దళితులు లేరు.. రాహుల్ గాంధీవి ‘‘బాల బుద్ధి’’ వ్యాఖ్యలు..
Also Read
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
- TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
- SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
నేరస్థులను వదిలిపెట్టబోమని.. వారిని రక్షించే వారిని కూడా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ‘ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, పోలీసు శాఖలు ఇలా ఎవరి ప్రమేయం ఉన్నా వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు వస్తూ పోతూనే ఉంటాయి. ముందు మహిళలను మనం కాపాడుకోవాలి. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించి మహిళల కోసం కొత్త నిబంధనలను రూపొందించాం. ఈ రోజు నేను దేశంలోని ప్రతి రాజకీయ పార్టీకి మరోసారి చెబుతున్నాను. మహిళలపై నేరం క్షమించరాని పాపమని రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాలి. దోషి ఎవరైనప్పటికీ, అతన్ని విడిచిపెట్టకూడదు. దోషికి సాయం చేసే వారిని వదిలి పెట్టం. ఆసుపత్రి, పాఠశాల, కార్యాలయం లేదా పోలీసు వ్యవస్థ ఏదైనా.. ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరిగినా అన్నింటినీ లెక్కిస్తాం.” అని ప్రధాని హెచ్చరించారు.
READ MORE:Srisailam Project: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు
ప్రధాని ఇంకా మాట్లాడుతూ.. “మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలను రూపొందిస్తున్నాం. గతంలో ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదని ఫిర్యాదులు వచ్చాయి. బీఎన్ఎస్ లో అనేక సవరణలు చేశాం. మహిళ పోలీసు స్టేషన్కు వెళ్లకూడదనుకుంటే, ఆమె ఇ-ఎఫ్ఐఆర్ను నమోదు చేయవచ్చు. ఇ-ఎఫ్ఐఆర్ను ఎవరూ మార్చలేరు. ప్రస్తుతం బీఎన్ఎస్ లో సవరణలు చేశాం. మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అండగా ఉంటుంది.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
-
Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
-
TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
-
Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
-
SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!