PM Modi: మహిళల రక్షకు కొత్త చట్టాలు.. ఎవ్వరినీ వదలం.. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
- మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తాం
- వారి రక్షణకు కొత్త చట్టాలు రూపొందిస్తున్నాం
- దోషులను రక్షించే వారిని కూడా వదలం
- ప్రధాని మోడీ సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాన్ని మరింత పటిష్ఠంగా, కఠినతరం చేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఈరోజు మహారాష్ట్ర జల్గావ్లోని లఖపతి దీదీ సదస్సులో ఏర్పాటు చేసిన సభకు మోడీ హాజరై ప్రసంగించారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో జనాల ఆగ్రహావేశాల మధ్య ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
READ MORE: Kiren Rijiju: మిస్ ఇండియాలో దళితులు లేరు.. రాహుల్ గాంధీవి ‘‘బాల బుద్ధి’’ వ్యాఖ్యలు..
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
నేరస్థులను వదిలిపెట్టబోమని.. వారిని రక్షించే వారిని కూడా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ‘ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, పోలీసు శాఖలు ఇలా ఎవరి ప్రమేయం ఉన్నా వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు వస్తూ పోతూనే ఉంటాయి. ముందు మహిళలను మనం కాపాడుకోవాలి. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించి మహిళల కోసం కొత్త నిబంధనలను రూపొందించాం. ఈ రోజు నేను దేశంలోని ప్రతి రాజకీయ పార్టీకి మరోసారి చెబుతున్నాను. మహిళలపై నేరం క్షమించరాని పాపమని రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాలి. దోషి ఎవరైనప్పటికీ, అతన్ని విడిచిపెట్టకూడదు. దోషికి సాయం చేసే వారిని వదిలి పెట్టం. ఆసుపత్రి, పాఠశాల, కార్యాలయం లేదా పోలీసు వ్యవస్థ ఏదైనా.. ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరిగినా అన్నింటినీ లెక్కిస్తాం.” అని ప్రధాని హెచ్చరించారు.
READ MORE:Srisailam Project: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు
ప్రధాని ఇంకా మాట్లాడుతూ.. “మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలను రూపొందిస్తున్నాం. గతంలో ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదని ఫిర్యాదులు వచ్చాయి. బీఎన్ఎస్ లో అనేక సవరణలు చేశాం. మహిళ పోలీసు స్టేషన్కు వెళ్లకూడదనుకుంటే, ఆమె ఇ-ఎఫ్ఐఆర్ను నమోదు చేయవచ్చు. ఇ-ఎఫ్ఐఆర్ను ఎవరూ మార్చలేరు. ప్రస్తుతం బీఎన్ఎస్ లో సవరణలు చేశాం. మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అండగా ఉంటుంది.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!