Kiren Rijiju: మిస్ ఇండియాలో దళితులు లేరు.. రాహుల్ గాంధీవి ‘‘బాల బుద్ధి’’ వ్యాఖ్యలు..
- రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్ ఆయనవి ‘‘బాల బుద్ధి’’ వ్యాఖ్యలు..
- ఆయన రాష్ట్రపతి.. ప్రధానిని చూడటం లేదు..
- ‘‘దళితులు మిస్ ఇండియాలో లేరు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: ‘‘మిస్ ఇండియా’’ పోటీల్లో దళితులు, ఆదివాసీలు లేరంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కేవలం ‘‘బాల బుద్ధి’’ నుంచి మాత్రమే వస్తాయని ఆయన అన్నారు. కులగణనను డిమాండ్ చేస్తూ ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరిగిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. 90 శాతం జనాభా భాగస్వామ్యం లేకుండా భారతదేశం సరిగా పనిచేయదని శనివారం అన్నారు. దళిత, ఆదివాసీ(గిరిజన), ఓబీసీ మహిళలు లేని మిస్ ఇండియా జాబితాను తాను చూశానని అన్నారు. కొందరు క్రికెట్, బాలీవుడ్ గురించి మాట్లాడుతారు, కానీ ఎవరూ చెప్పులు కుట్టేవారు గురించి మాట్లాడరని అన్నారు. మీడియాలో యాంకర్లలో కూడా 90 శాతం మంది లేరని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Hyderabad Ponds: 18 చోట్ల కూల్చివేతలు.. 43 ఎకరాల ప్రభుత్వ భూమి రికవరీ! ప్రముఖుల లిస్ట్ ఇదే
Also Read
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు స్పందిస్తూ.. దేశానికి ద్రౌపది ముర్ము గిరిజనురాలైన మొదటి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఓబీసీకి చెందినవారు, అనేక మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కేబినెట్ మంత్రులుగా ఉన్నారని అన్నారు. ‘‘ రాహుల్ గాంధీ మిస్ ఇండియా పోటీలు, చలనచిత్రాలు, క్రీడలలో రిజర్వేషన్లు కోరుకుంటున్నాడు! ఇది ‘బాలక్ బుద్ధి’ సమస్య మాత్రమే కాదు, అతనిని ఉత్సాహపరిచే వ్యక్తులు కూడా అంతే బాధ్యత వహిస్తారు!’’ అని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పిల్లల తెలివితేటలు వినోదానికి మంచివి కావచ్చు, కానీ మీ విభజన వ్యూహాలలో వెనకబడి వర్గాలను ఎగతాళి చేయొద్దు అని సూచించారు.
రాహుల్ గాంధీ జీ, ప్రభుత్వాలు మిస్ ఇండియాని ఎంపిక చేయవు, ప్రభుత్వాలు ఒలింపిక్స్కి క్రీడాకారుల్ని ఎంపిక చేయవు, ప్రభుత్వాలు సినిమాల్లో నటీనటుల్ని ఎంపిక చేయవని అన్నారు. అలాగే, ఐఏఎస్, ఐపీఎష్, ఐఎఫ్ఎష్ వంటి అన్ని టాప్ రిక్రూట్మెంట్లలో రిజర్వేషన్లు మార్చడానికి సుప్రీంకోర్టు అంగీకరించదని రాహుల్ గాంధీనే స్పష్టం చేశారు. అయితే, అతను భారత రాష్ట్రపతిగా గిరిజనురాలు ఉండటం, ప్రధానిగా ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఉండటాన్ని చూడటం లేదు అని అన్నారు.కులగణన డిమాండ్తో రాహుల్ గాంధీ దేశాన్ని విభజించేందుకు డిమాండ్ చేస్తున్నారని బీజేపీ మండిపడుతోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అర్ధరాత్రి 2 గంటలకు గదిలో లేని వైభవ్.. టెన్షన్ పడిపోయిన బుడ్డోడి తల్లి!
-
FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై ‘దక్షిణ కొరియా’ సంచలన విజయం.!
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
-
SPIRIT : ప్రభాస్ కోసం అసలు సిసలైన డ్యూటీ చేస్తున్న సందీప్ రెడ్డి
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!