Army Dog Kent: ‘ఆపరేషన్ సుజలిగల’లో హీరోగా నిలిచిన జాగిలానికి శౌర్య అవార్డు..
- 'ఆపరేషన్ సుజలిగల'లో హీరోగా నిలిచిన కెంట్ అనే జాగిలానికి శౌర్య పురస్కారం
- స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మరణానంతరం పురస్కారం ప్రకటించిన రాష్ట్రపతి
- గతేడాది సెప్టెంబర్ 11న ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ బలగాలు, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సిబ్బందికి 103 శౌర్య పురస్కారాలను ప్రకటించారు. ఇందులో నాలుగు కీర్తి చక్ర, 18 శౌర్య చక్ర అవార్డ్స్ ఉన్నాయి. ఇద్దరు వీర వైమానిక దళ సైనికులకు శౌర్యచక్ర, ఆరుగురు సైనికులకు వాయుసేన పతకం లభించాయి. మరణానంతరం 9 మందికి పురస్కారాలను ప్రకటించారు. అయితే.. రాష్ట్రపతి పురస్కారాలను ప్రకటించిన దానిలో ఒక పేరు షాకింగ్గా ఉంది. జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులపై ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సుజలిగల’లో హీరోగా నిలిచిన కెంట్ అనే జాగిలానికి మరణానంతరం రాష్ట్రపతి శౌర్య పురస్కారం ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్ 11న ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఆ జాగిలం ప్రాణాలు కోల్పోయింది.
తొమ్మిది తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న కెంట్.. గత ఏడాది సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలోని నార్లా గ్రామంలో మూడు రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో తన హ్యాండ్లర్ను కూడా రక్షించింది. రాజౌరీ సెక్టార్లోని రోమియో ఫోర్స్కు చెందిన ఆర్ఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న జాగిలం ‘ఆపరేషన్ సుజలిగల’కు నాయకత్వం వహించింది. ఆర్మీ 21వ ఆర్మీ డాగ్ యూనిట్ (కె9)కి చెందిన ఆరేళ్ల లాబ్రడార్ కెంట్ మరణంపై రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి మాట్లాడుతూ.. పారిపోతున్న ఉగ్రవాదులను వెంబడిస్తున్న సైనికుల బృందానికి జాగిలం నాయకత్వం వహించిందని తెలిపారు. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న సమయంలో వారిపై దాడి చేసింది. ఆ సమయంలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిందని తెలిపారు.
Also Read
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
Sri Lanka: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల బరిలో 39 మంది అభ్యర్థులు..
కెంట్ తన హ్యాండ్లర్ను కాపాడుతూ భారత సైన్యం యొక్క ఉత్తమ సంప్రదాయాలలో తన జీవితాన్ని త్యాగం చేసింది పేర్కొన్నారు. ఉగ్రవాదులతో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఒక జవాను వీరమరణం పొందగా, ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. అదే సమయంలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను కూడా హతమార్చాయి. కెంట్ విషాద మరణానికి అప్పటి ఉత్తర ఆర్మీ కమాండర్, ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంతాపం తెలిపారు. కెంట్ తన హ్యాండ్లర్ను రక్షించడానికి తన ప్రాణాలను ఇచ్చిందని చెప్పారు.
కెంట్ మరణంపై శిక్షణ వీడియోను విడుదల చేశారు. ఆర్మీ సైనికుడితో కలిసి నడుస్తున్నట్లు వీడియోలో కనిపించింది. కెంట్ తన లక్ష్యాన్ని సులభంగా సాధించగలదు.. పని పట్ల తనకున్న అంకితభావాన్ని చూపుతుంది. కెంట్కు లాంఛనంగా వీడ్కోలు పలుకుతుండగా.. సైన్యం కెంట్ మృతదేహాన్ని త్రివర్ణ పతాకంలో చుట్టి దానిపై పుష్పగుచ్ఛాన్ని ఉంచారు. గోల్డెన్ కలర్ ట్రాకర్ కెంట్ ఆర్మీ నంబర్ 08B2 అని పేర్కొంటూ ఆర్మీ ప్రెస్ బ్రీఫ్ విడుదల చేసింది.
తాజావార్తలు
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..