President Droupadi Murmu: ‘ఆపరేషన్ సింధూర్’.. ఉగ్రవాదమనే రావణుడిపై సాధించిన నిర్ణయాత్మక విజయానికి ప్రతీక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Droupadi Murmu: భారీ వర్షం కురుస్తున్నా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రోజున ఎర్రకోటలో జరిగిన దసరా వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత సాయుధ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ అనేది ఉగ్రవాదమనే రావణుడిపై సాధించిన నిర్ణయాత్మక విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఎర్రకోటలోని మాధవదాస్ పార్కులో జరిగిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో రాష్ట్రపతి బాణం ఎక్కుపెట్టారు.
Putin: భారత్ అవమానాన్ని ఎప్పటికీ అంగీకరించదు.. అమెరికాపై పుతిన్ ఫైర్..
Also Read
- Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- Nandamuri Tejaswini: డాన్స్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె.. వీడియో వైరల్
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఈ పండుగ ఎల్లప్పుడూ చెడుపై మంచి సాధించిన విజయాన్ని, అహంకారంపై వినయం సాధించిన విజయాన్ని, అలాగే ద్వేషంపై ప్రేమ సాధించిన విజయాన్ని సూచిస్తుందని చెప్పారు. ధార్మిక రామ్లీలా కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘ఉగ్రవాదం మానవత్వంపై దాడి చేసినప్పుడు, దానిని తిప్పికొట్టడం అవసరం. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదమనే రావణుడిపై సాధించిన విజయానికి గుర్తు, ఇందుకోసం మన సైనికులకు వందనం’ అని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ అనేది మే 7వ తేదీన పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ప్రారంభించిన ఒక సైనిక చర్య. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో సాయుధ ఉగ్రవాదులు పౌరులను, ముఖ్యంగా 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన ఘటనకు ఇది ప్రతిస్పందనగా ఉంది.
Taliban: భారతదేశ పర్యటనకు తాలిబాన్ విదేశాంగ మంత్రి..
భారీ వర్షం ఉన్నప్పటికీ.. రావణ దహనం చూడడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఎర్రకోట వద్ద గుమిగూడారని ఆమె పేర్కొన్నారు. రావణుడిపై శ్రీరాముడి విజయం నుంచి ఉద్భవించిన ఈ సంప్రదాయాన్ని గుర్తుచేసుకుంటూ, రావణుడి బొమ్మను దహనం చేయడం అనేది ఒక లోతైన సందేశాన్ని కూడా ఇస్తుందని ముర్ము చెప్పారు. ఈ కార్యక్రమం బయట ఉన్న రావణుడిని నాశనం చేయడమే కాదు, మనలో ఉన్న రావణుడిని కూడా అంతం చేయడమే. అప్పుడే సమాజం శాంతి, సామరస్యంతో ముందుకు సాగగలదని ఆమె అన్నారు. అంతేకాకుండా అంతర్గత దుర్మార్గాలను అధిగమించాలని కోరారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజావార్తలు
-
13 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీ.. 23 మ్యాచ్ల్లోనే ప్రపంచ క్రికెట్ను షేక్ చేసిన Vaibhav Sooryavanshi రికార్డుల లిస్ట్ ఇదే..
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
-
Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
-
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..