Droupadi Murmu: ప్రపంచ వాణిజ్య సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Droupadi Murmu: ప్రపంచ వాణిజ్యంలో ఎదురవుతున్న సవాళ్లను కొత్త అవకాశాలుగా మలచుకోవడానికి భారతదేశం తనకున్న అసాధారణ సామర్థ్యాలను వినియోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన ఇంజినీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (EEPC) ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా ఆమె ప్రసంగించారు. గత ఏడు దశాబ్దాల్లో భారతదేశ ఇంజినీరింగ్ ఎగుమతుల గమ్యస్థానాలు గణనీయంగా మారాయని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘నేషన్ ఫస్ట్’ (Nation First) అనే స్ఫూర్తితో ఈ మార్పును కొనసాగిస్తూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి EEPC కృషి చేయాలని రాష్ట్రపతి సూచించారు.
గుండె సమస్యలకు ఈ ఆహార పదార్దాలతో పూర్తిగా చెక్ పెట్టండి…
Also Read
- CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
- SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
గత పదేళ్లలో భారతదేశ ఇంజినీరింగ్ ఎగుమతులు 70 బిలియన్ల డాలర్స్ నుండి 115 బిలియన్ల డాలర్స్ కు పైగా పెరిగాయని ఆమె తెలిపారు. గత దశాబ్దంలో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ వృద్ధి సాధించడం ఎంతో అభినందనీయమని ఆమె అన్నారు. తక్కువ ధరలో అధిక నాణ్యత కలిగిన ఇంజినీరింగ్ సేవలు, ఉత్పత్తులు భారతదేశానికి గొప్ప బలం అని ఆమె అన్నారు. అంతర్జాతీయ మార్కెట్కి, భారతీయ ఉత్పత్తిదారులకు మధ్య EEPC ఒక వారధిగా పనిచేసిందని ఆమె ప్రశంసించారు. ప్రపంచ విలువ గొలుసులో భారతదేశ పాత్రను నిరంతరం విస్తరించాలని ఆమె EEPCని కోరారు.
ప్రధాని మోడీ పుట్టిన రోజున ‘Swasth Nari Sashakt Parivar Abhiyaan’ ప్రారంభం.. వివరాలు ఇలా!
ప్రపంచ వాణిజ్య క్రమంలో, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పుల కారణంగా EEPC పాత్ర మరింత ముఖ్యమైనదని ముర్ము నొక్కి చెప్పారు. ఆర్థిక రంగంలో ఒక ముఖ్యమైన వాటాదారుగా EEPC మరింత సంకల్పంతో పనిచేయాలని ఆమె అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు భారతదేశంలో ఉన్నాయని, EEPC వంటి వాటాదారులు సరైన ప్రోత్సాహకాలు, అనుకూల వాతావరణాన్ని కల్పించి భారతదేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్గా మార్చాలనే ఆలోచనతో ముందుకు సాగాలని ముర్ము అన్నారు. ఆవిష్కరణ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో అత్యంత పోటీతత్వంతో, సంపన్నంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. దేశంలో ఉన్న ప్రతిభ, శక్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి, భారతదేశాన్ని ఒక ప్రముఖ ఆవిష్కరణ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆమె EEPC వాటాదారులను కోరారు.
తాజావార్తలు
-
CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!