ప్రధాని మోడీ పుట్టిన రోజున ‘Swasth Nari Sashakt Parivar Abhiyaan’ ప్రారంభం.. వివరాలు ఇలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swasth Nari Sashakt Parivar Abhiyaan: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని ఈసారి కూడా ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ పార్టీ 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు సేవా పఖవాడిని నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంలో ప్రధాని మోడీ పుట్టినరోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా “స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్” ను ప్రారంభించనున్నారు. ఈ యోజన ప్రధాన ఉద్దేశ్యం దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లల ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడమే.
Jerusalem: జెరూసలేంలో రక్తపాతం .. హమాస్ కాల్పుల్లో ఇజ్రాయెల్ పౌరులు మృతి
Also Read
- TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా సోషల్ మీడియా ద్వారా దీనిని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 17 సెప్టెంబర్ 2025న స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ యోజన ద్వారా దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లల ఆరోగ్య సేవలకు మెరుగైన, నాణ్యమైన సేవలతో పాటు అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం.
World Record: వీడు మామూలోడు కాదు భయ్యా.. వరల్డ్ రికార్డ్ను బద్దలు కొట్టాడు..!
జేపీ నడ్డా తెలిపినట్టు, ఈ జాతీయ స్థాయి ప్రచార యోజన కింద మొత్తం 75,000 ఆరోగ్య శిబిరాలు (Ayushman Arogya Mandirs, Community Health Centers (CHC), ఇతర ఆరోగ్య కేంద్రాల్లో) నిర్వహించబడతాయి. ఈ శిబిరాలు ప్రత్యేకంగా మహిళలు, పిల్లల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు రూపొందించబడనున్నాయి. ఇక్కడ వారికి అవసరమైన అన్ని ఆరోగ్య సేవలు అందజేయబడతాయి. ఇవి ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఆరోగ్య సేవా విధానాన్ని బలోపేతం చేస్తాయి. అలాగే పోషణ, ఆరోగ్య అవగాహనతో పాటు సమగ్ర సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు అన్ని ఆంగనవాడీల్లో ప్రత్యేకంగా పోషణ నెల నిర్వహించబడనుంది. ఈ చర్యల ద్వారా దేశవ్యాప్తంగా ఆరోగ్యవంతమైన కుటుంబాలు, శక్తివంతమైన సమాజాలు నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी 17 सितम्बर 2025 को ‘स्वस्थ नारी, सशक्त परिवार अभियान’ का शुभारंभ करेंगे।
इस अभियान का उद्देश्य महिलाओं और बच्चों के लिए स्वास्थ्य सेवाओं को सशक्त कर, उनकी बेहतर पहुंच, गुणवत्तापूर्ण देखभाल और जागरूकता सुनिश्चित करना है।
इस अभियान के… pic.twitter.com/Dn5PpkLkpG
— Jagat Prakash Nadda (@JPNadda) September 8, 2025
తాజావార్తలు
-
S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
-
Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్లో కింగ్ రైటింగ్!
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
-
TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!