Droupadi Murmu: పాక్ తప్పుడు ప్రచారాలకు రాష్ట్రపతి చెక్.. ధీశాలి “శివాంగి సింగ్”తో ద్రౌపది ముర్ము ఫొటో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Droupadi Murmu: పాక్ తప్పుడు ప్రచారాలకు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెక్ పెట్టేశారు. బుధవారం రాఫెల్ ఫైటర్ జెట్లో 30 నిమిషాల పాటు విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్థావరంలో స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్తో కలిసి ఫొటో దిగారు. గతంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని.. ఆ విమాన పైలట్ శివాంగి సింగ్ను యుద్ధ ఖైదీగా అదుపులోకి తీసుకున్నమని దాయాది దేశం తప్పుడు వార్తలు వ్యాప్తి చెందేలా చేసింది. ఈ వార్తలపై అప్పట్లో భారత్ స్పందించింది. ధీశాలి శివాంగి సింగ్ భారత్లో సేఫ్గా ఉందని తేల్చి చెప్పింది. పాక్ బూటకపు మాటలను తప్పికొట్టింది. అయితే.. తాజాగా ధీశాలి శివాంగి సింగ్ భారత్లో సురక్షితంగా ఉన్నారని దేశ మొదటి పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి తెలియజేశారు.
READ MORE: Manchu Lakshmi : ఆ సినిమా ఫ్లాప్ వల్ల.. నాకు చాలా పెద్ద దెబ్బ పడింది
Also Read
- Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్లో రెండో రౌండ్కు అర్హత
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
- Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
ఇంతకీ శివాంగి సింగ్ ఎవరు..?
ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ పాకిస్థాన్పై వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్ భారత్కు చెందిన యుద్ధ విమానాలను కూల్చేశామని అసత్య ప్రచారాలు చేసింది. సిగ్గు లేకుండా భారత్ కు చెందిన ఒక మహిళా పైలట్ పట్టుబడ్డారని పాకిస్థాన్ సోషల్ మీడియాలో ఒక అబద్ధాన్ని వేగంగా ప్రచారం చేసింది. అయితే ఇది పచ్చి అబద్ధమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అప్పట్లోనే తేల్చి చెప్పింది.
READ MORE: Montha Cyclone: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఆ జిల్లాలోని సూళ్లకు సెలవులు
శివంగి సింగ్ రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన భారత మొట్టమొదటి, ఏకైక మహిళా పైలట్. శివంగి సింగ్ 1995 మార్చి 15న ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జన్మించారు. ఆమె తండ్రి హరిభూషణ్ సింగ్ ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. ప్రస్తుతం ఆయన ఒక ప్రభుత్వ పాఠశాలకు ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఆమె తల్లి ప్రియాంక సింగ్ గృహిణి. శివాంగి ఒక సాధారణ కుటుంబానికి చెందినది. ఆమె ముత్తాత బాలికల విద్య కోసం తనకున్న భూమిని విరాళంగా ఇచ్చారు. శివాంగి తన ప్రాథమిక విద్యను వారణాసిలోనే చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్లో బిటెక్ చేసింది. శివాంగి పైలట్ అయ్యే కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు తన గ్రామంలో ఒక రాజకీయ నాయకుడి హెలికాప్టర్ దిగిన సంఘటన ఆమెను పైలట్ కావడానికి ప్రేరణనిచ్చింది.
తాజావార్తలు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్లో రెండో రౌండ్కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?