Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saharsa Passenger Train Fire: బీహార్లోని సహర్సా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలు (నంబర్: 63344)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిమ్రీ బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్లో తీవ్ర కలకలం రేగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. దీనితో రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు వెంటనే స్పందించడంతో అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊపిరిపీల్చుకున్నారు.
సోమవారం ఉదయం సుమారు 3:40 గంటలకు సమస్తిపూర్ నుంచి సహర్సా వెళ్తున్న ప్యాసింజర్ రైలు సిమ్రీ బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్-2 వద్ద ఆగింది. ఈ సమయంలో ఇంజిన్కు ఆనుకుని ఉన్న బోగీలోని బ్యాటరీ బాక్స్ సమీపంలో పొగ రావడం మొదలైంది. మొదట్లో దీనిని సాధారణ సాంకేతిక లోపంగా అనుకున్నప్పటికీ, కొద్ది నిమిషాల్లోనే అది భారీ మంటగా మారి మొత్తం బోగీని ఆహుతి చేసింది. దీంతో ఒక బోగీ పూర్తిగా దగ్ధమైంది.
Also Read
- 8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
- IND Vs PAK: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
ఘటన సమయంలో రైల్వే అధికారులు స్టేషన్లో అత్యవసర ప్రకటనలు చేసి ప్రయాణికులను వెంటనే రైలు నుంచి దిగాలని సూచించారు. ఆ తర్వాత RPF, GRP పోలీసులు, రైల్వే సిబ్బంది కలిసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. ఇక అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించిన తర్వాత అగ్నిని పూర్తిగా అదుపు చేయగలిగారు. వేగంగా చేపట్టిన సహాయక చర్యలతో పెను ప్రమాదం తప్పింది.
ఈ అగ్నిప్రమాదం కారణంగా సహర్సా-సమస్తిపూర్ రైల్వే మార్గంలో సుమారు రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రైళ్లను మధ్యలో నిలిపివేయగా, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపించారు. ప్రభావితమైన రైళ్లలో మనిహారి-జయనగర్ జానకీ ఎక్స్ప్రెస్, కోసీ ఎక్స్ప్రెస్, దేవఘర్ ప్యాసింజర్తో పాటు మరికొన్ని రైళ్లు ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
A fire broke out in the engine and an adjoining coach of passenger train number 63344 (Samastipur–Saharsa) at Simri Bakhtiyarpur railway station in Bihar's Saharsa around 3 am. Passengers were evacuated safely, and no casualties have been reported. pic.twitter.com/4DjCGnMrLJ
— Vani Mehrotra (@vani_mehrotra) August 3, 2026
తాజావార్తలు
-
Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Cocktail 2 OTT Release: ఓటీటీలోకి రష్మిక, కృతి సనన్, షాహిద్ ల ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తెలుగులోనూ చూడవచ్చు
-
Honor Play 11 Pro: హానర్ ప్లే 11 ప్రో రిలీజ్.. 50MP కెమెరా, 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారం, ఉద్యోగంలో అనుకూలతలు!
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!