Fake Cakes: తక్కువ ధరకే కేక్.. కల్తీ కేటుగాళ్లపై పోలీసులు నజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Cakes: హైదరాబాద్లో కల్తీ దందా జోరుగా సాగుతోంది. ఇటీవల నకిలీ ఐస్క్రీమ్లు తయారు చేస్తూ ఓ ముఠా పట్టుబడగా.. ఇప్పుడు కేకులు, స్వీట్లు తయారు చేస్తూ పట్టుబడుతుండడంతో.. ఏం తినాలన్నా భయపడుతున్నారు. నగరంలో కల్తీ పదార్థాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటీవల నకిలీ నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలను తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కల్తీ కేక్లు తయారు చేస్తున్న ముఠాపై ఎస్వోటీ బాలానగర్ పోలీసులు దాడి చేశారు. బాచుపల్లి పరిధిలోని నిజాంపేటలోని బాలాజీ కేక్ ఫ్యాక్టరీలో కల్తీ కేకులు తయారు చేస్తున్నారనే సమాచారంతో సోదాలు చేశారు. కేకుల తయారీలో రసాయన రంగులు వాడుతున్నట్లు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో కేక్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. యజమాని గోపాల కృష్ణ పరారీలో ఉండగా, అక్కడ పనిచేస్తున్న సయ్యద్ వాసిఫ్తో పాటు కేక్ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు.
Read also: Nandakumar: GHMC కమిషనర్ పై చర్యలు తీసుకోండి.. హైకోర్ట్ ను ఆశ్రయించిన నందకుమార్
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ఎక్స్పైర్ డేట్ క్రీములు, పాచిపోయిన కేక్ తయారీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి కేక్లను తయారు చేసి ఇతర దుకాణాలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, లేబర్ లైసెన్స్ లేకుండానే కేక్ పరిశ్రమ నడుస్తోందని తేల్చారు. ఎస్ఓటీ పోలీసులు నిందితుడిని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొగల్పురా పోలీస్స్టేషన్ పరిధిలో నకిలీ మిఠాయిల తయారీ ముఠా పోలీసులకు చిక్కింది. లాల్ దర్వాజా ప్రాంతంలోని ఓ ఇంట్లో నకిలీ మిఠాయిలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కలకన్, అజ్మీరీ కలకన్, ఖోవా వంటి స్వీట్లను నకిలీగా తయారు చేస్తున్నట్లు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. బాల్ గోపాల్ యోజన పథకం కింద రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాలపొడిని తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలించినట్లు వెల్లడైంది. ఈ పొడిని కేక్ల తయారీకి ఉపయోగిస్తారు. నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి మిఠాయిలు తయారు చేసి బ్రాండెడ్ కవర్లతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. స్థానిక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వీరిని రిమాండ్కు తరలించినట్లు తెలుస్తోంది.
Variety Thief: అట్టముక్కతో దొంగతనం.. అడ్డంగా దొరికిపోయిన దొంగ
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!