Fake Cakes: తక్కువ ధరకే కేక్.. కల్తీ కేటుగాళ్లపై పోలీసులు నజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Cakes: హైదరాబాద్లో కల్తీ దందా జోరుగా సాగుతోంది. ఇటీవల నకిలీ ఐస్క్రీమ్లు తయారు చేస్తూ ఓ ముఠా పట్టుబడగా.. ఇప్పుడు కేకులు, స్వీట్లు తయారు చేస్తూ పట్టుబడుతుండడంతో.. ఏం తినాలన్నా భయపడుతున్నారు. నగరంలో కల్తీ పదార్థాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటీవల నకిలీ నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలను తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కల్తీ కేక్లు తయారు చేస్తున్న ముఠాపై ఎస్వోటీ బాలానగర్ పోలీసులు దాడి చేశారు. బాచుపల్లి పరిధిలోని నిజాంపేటలోని బాలాజీ కేక్ ఫ్యాక్టరీలో కల్తీ కేకులు తయారు చేస్తున్నారనే సమాచారంతో సోదాలు చేశారు. కేకుల తయారీలో రసాయన రంగులు వాడుతున్నట్లు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో కేక్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. యజమాని గోపాల కృష్ణ పరారీలో ఉండగా, అక్కడ పనిచేస్తున్న సయ్యద్ వాసిఫ్తో పాటు కేక్ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు.
Read also: Nandakumar: GHMC కమిషనర్ పై చర్యలు తీసుకోండి.. హైకోర్ట్ ను ఆశ్రయించిన నందకుమార్
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
ఎక్స్పైర్ డేట్ క్రీములు, పాచిపోయిన కేక్ తయారీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి కేక్లను తయారు చేసి ఇతర దుకాణాలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, లేబర్ లైసెన్స్ లేకుండానే కేక్ పరిశ్రమ నడుస్తోందని తేల్చారు. ఎస్ఓటీ పోలీసులు నిందితుడిని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొగల్పురా పోలీస్స్టేషన్ పరిధిలో నకిలీ మిఠాయిల తయారీ ముఠా పోలీసులకు చిక్కింది. లాల్ దర్వాజా ప్రాంతంలోని ఓ ఇంట్లో నకిలీ మిఠాయిలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కలకన్, అజ్మీరీ కలకన్, ఖోవా వంటి స్వీట్లను నకిలీగా తయారు చేస్తున్నట్లు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. బాల్ గోపాల్ యోజన పథకం కింద రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాలపొడిని తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలించినట్లు వెల్లడైంది. ఈ పొడిని కేక్ల తయారీకి ఉపయోగిస్తారు. నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి మిఠాయిలు తయారు చేసి బ్రాండెడ్ కవర్లతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. స్థానిక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వీరిని రిమాండ్కు తరలించినట్లు తెలుస్తోంది.
Variety Thief: అట్టముక్కతో దొంగతనం.. అడ్డంగా దొరికిపోయిన దొంగ
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!