Power Purchase: విద్యుత్ సంస్థల నెత్తిన మరో గుదిబండ..
- విద్యుత్ సంస్థల నెత్తిన మరో గుదిబండ
- ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ డిస్కంలను విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయకుండా నిలిపివేసిన పవర్ ఎక్ఛేంజీలు
- చత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన..
- రూ. 261 కోట్లు తెలంగాణ చెల్లించాలని ఫిర్యాదు చేసిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్
- తెలంగాణ డిస్కంలను విద్యుత్తు బిడ్లలో పాల్గొనకుండా అడ్డుకున్న నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్
- గత్యంతరం లేకపోవటంతో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర విద్యుత్ సంస్థల నెత్తిన మరో గుదిబండ పెట్టాయి. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ డిస్కంలను విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్ఛేంజీలు నిలిపివేశాయి. చత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన రూ. 261 కోట్లు తెలంగాణ చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ డిస్కంలను విద్యుత్తు బిడ్లలో పాల్గొనకుండా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అడ్డుకున్నాయి. దీంతో.. గత్యంతరం లేకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.
Read Also: Road Accident: ఘోర ప్రమాదం.. అదుపు తప్పి కారుపై పడిన కంటైనర్, నలుగురు మృతి
Also Read
కాగా.. చత్తీస్గఢ్ నుంచి విద్యుత్తును తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తో విద్యుత్తు సరఫరాకు గత ప్రభుత్వం కారిడార్ బుక్ చేసుకుంది. ఈ కారిడార్ వివాదం ఇప్పుడు తెలంగాణ డిస్కంల మెడకు చుట్టుకుంటుందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. చత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు లభించే అవకాశం లేదని ఈ కారిడార్ ను గత ప్రభుత్వం అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. అవసరం లేకున్నా.. గత ప్రభుత్వం కారిడార్లను ముందుగానే బుక్ చేసుకోవడంతో ప్రస్తుతం డిస్కమ్స్ పై ఆర్థిక భారం పడుతుంది. వాడినా వాడకున్నా.. పరిహారం కింద రూ. 261 కోట్లు కట్టాలని పీజీసీఐఎల్ తెలంగాణ డిస్కంలకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ వివాదంపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ను తెలంగాణ డిస్కంలు ఆశ్రయించాయి. వివాదం సీఈఆర్సీ పరిధిలో ఉండగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించనుంది.
Read Also: MP: మధ్యప్రదేశ్లో ఘోరం.. ఇంటి గోడ కూలి ఏడుగురు మృతి
తాజావార్తలు
-
Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..
-
Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
-
CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్లో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్
-
Love Marraige: ప్రేమంటే ఇదే.. మాజీ ఖైదీని పెళ్లాడిన మహిళా జైలర్..
-
Tamil Nadu: లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన విజయ్.. రేపు చెబుతామన్న వామపక్షాలు