Poonam Pandey : పుకార్లు వ్యాప్తి చేసినందుకు పూనమ్ ను అరెస్ట్ చేస్తారా.. శిక్ష ఏంటంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Pandey : మోడల్, నటి పూనమ్ పాండే మరణ వార్తతో అందరూ షాక్ అయ్యారు. అయితే మరుసటి రోజు అంటే శనివారం పూనమ్ పాండే స్వయంగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేసి తాను బతికే ఉందని చెప్పింది. పూనమ్ పాండే స్వయంగా తన మరణ వార్తను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ప్రచారం కోసం ప్రయత్నించింది. ఆమె చర్యపై సోషల్ మీడియాలో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ న్యూస్ను ప్రచారం చేసినందుకు పూనమ్ పాండేపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అన్న సందేహాలు జనాల్లో తలెత్తుతున్నాయి.
నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు పూనమ్ జైలు శిక్ష అనుభవించవచ్చు. దీనితో పాటు జరిమానా కూడా విధించవచ్చు. ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 67 ప్రకారం, ఎవరైనా మొదటిసారి సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినందుకు దోషిగా తేలితే, అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే రూ.5 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. నేరం పునరావృతమైతే నేరస్థుడు 5 సంవత్సరాల జైలు, 10 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Read Also:Canada–India relations: భారత్పై మరోసారి విషం చిమ్ముతున్న కెనడా..
ఇన్స్టాగ్రామ్లో వీడియోను పంచుకుంటూ ‘హలో నేను పూనమ్. నన్ను క్షమించండి, నేను బాధపెట్టిన వారికి క్షమాపణలు చెబుతున్నాను. అందరినీ ఆశ్చర్యపరచడమే నా ఉద్దేశం, ఎందుకంటే మనం ఎక్కువగా మాట్లాడని గర్భాశయ క్యాన్సర్ గురించి చర్చించాలనుకున్నాను. అవును, నా మరణానికి సంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేశాను. అకస్మాత్తుగా మేమంతా గర్భాశయ క్యాన్సర్ గురించి మాట్లాడటం ప్రారంభించాము. ఇది నిశ్శబ్దంగా మీ జీవితాన్ని లాక్కునే వ్యాధి. ఈ వ్యాధి గురించి మరింత మాట్లాడవలసిన అవసరం ఉంది. నా మరణవార్త వల్ల అందరికీ ఈ వ్యాధి గురించి తెలిసినందుకు నేను గర్వపడుతున్నాను.’ అంటూ చెప్పుకొచ్చింది.
కంగనా రనౌత్, మునావర్ ఫరూఖీ, డైసీ షా, పూజా భట్ సహా పలువురు ప్రముఖులు ఆమె మరణవార్త పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్లో తన సంతాపాన్ని తెలియజేసింది. పూనమ్ పాండే తన రియాల్టీ షోలో భాగమైంది. ఇది చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ బారిన పడి యువతి ప్రాణాలు కోల్పోవడం విషాదం. పూనమ్ పాండే తన గర్భాశయ క్యాన్సర్ గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదని నటి సంభవనా సేథ్ చెప్పారు. ఖత్రోన్ కే ఖిలాడీ అనే రియాల్టీ షోలో పూనమ్తో కలిసి సంభవన్ పాల్గొంది.
Read Also:Telangana Cabinet Meeting: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చ..
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!