Poonam Pandey : పుకార్లు వ్యాప్తి చేసినందుకు పూనమ్ ను అరెస్ట్ చేస్తారా.. శిక్ష ఏంటంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Pandey : మోడల్, నటి పూనమ్ పాండే మరణ వార్తతో అందరూ షాక్ అయ్యారు. అయితే మరుసటి రోజు అంటే శనివారం పూనమ్ పాండే స్వయంగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేసి తాను బతికే ఉందని చెప్పింది. పూనమ్ పాండే స్వయంగా తన మరణ వార్తను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ప్రచారం కోసం ప్రయత్నించింది. ఆమె చర్యపై సోషల్ మీడియాలో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ న్యూస్ను ప్రచారం చేసినందుకు పూనమ్ పాండేపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అన్న సందేహాలు జనాల్లో తలెత్తుతున్నాయి.
నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు పూనమ్ జైలు శిక్ష అనుభవించవచ్చు. దీనితో పాటు జరిమానా కూడా విధించవచ్చు. ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 67 ప్రకారం, ఎవరైనా మొదటిసారి సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినందుకు దోషిగా తేలితే, అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే రూ.5 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. నేరం పునరావృతమైతే నేరస్థుడు 5 సంవత్సరాల జైలు, 10 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
Also Read
Read Also:Canada–India relations: భారత్పై మరోసారి విషం చిమ్ముతున్న కెనడా..
ఇన్స్టాగ్రామ్లో వీడియోను పంచుకుంటూ ‘హలో నేను పూనమ్. నన్ను క్షమించండి, నేను బాధపెట్టిన వారికి క్షమాపణలు చెబుతున్నాను. అందరినీ ఆశ్చర్యపరచడమే నా ఉద్దేశం, ఎందుకంటే మనం ఎక్కువగా మాట్లాడని గర్భాశయ క్యాన్సర్ గురించి చర్చించాలనుకున్నాను. అవును, నా మరణానికి సంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేశాను. అకస్మాత్తుగా మేమంతా గర్భాశయ క్యాన్సర్ గురించి మాట్లాడటం ప్రారంభించాము. ఇది నిశ్శబ్దంగా మీ జీవితాన్ని లాక్కునే వ్యాధి. ఈ వ్యాధి గురించి మరింత మాట్లాడవలసిన అవసరం ఉంది. నా మరణవార్త వల్ల అందరికీ ఈ వ్యాధి గురించి తెలిసినందుకు నేను గర్వపడుతున్నాను.’ అంటూ చెప్పుకొచ్చింది.
కంగనా రనౌత్, మునావర్ ఫరూఖీ, డైసీ షా, పూజా భట్ సహా పలువురు ప్రముఖులు ఆమె మరణవార్త పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్లో తన సంతాపాన్ని తెలియజేసింది. పూనమ్ పాండే తన రియాల్టీ షోలో భాగమైంది. ఇది చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ బారిన పడి యువతి ప్రాణాలు కోల్పోవడం విషాదం. పూనమ్ పాండే తన గర్భాశయ క్యాన్సర్ గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదని నటి సంభవనా సేథ్ చెప్పారు. ఖత్రోన్ కే ఖిలాడీ అనే రియాల్టీ షోలో పూనమ్తో కలిసి సంభవన్ పాల్గొంది.
Read Also:Telangana Cabinet Meeting: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చ..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!