Poonam Pandey : పుకార్లు వ్యాప్తి చేసినందుకు పూనమ్ ను అరెస్ట్ చేస్తారా.. శిక్ష ఏంటంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Pandey : మోడల్, నటి పూనమ్ పాండే మరణ వార్తతో అందరూ షాక్ అయ్యారు. అయితే మరుసటి రోజు అంటే శనివారం పూనమ్ పాండే స్వయంగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేసి తాను బతికే ఉందని చెప్పింది. పూనమ్ పాండే స్వయంగా తన మరణ వార్తను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ప్రచారం కోసం ప్రయత్నించింది. ఆమె చర్యపై సోషల్ మీడియాలో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ న్యూస్ను ప్రచారం చేసినందుకు పూనమ్ పాండేపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అన్న సందేహాలు జనాల్లో తలెత్తుతున్నాయి.
నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు పూనమ్ జైలు శిక్ష అనుభవించవచ్చు. దీనితో పాటు జరిమానా కూడా విధించవచ్చు. ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 67 ప్రకారం, ఎవరైనా మొదటిసారి సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినందుకు దోషిగా తేలితే, అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే రూ.5 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. నేరం పునరావృతమైతే నేరస్థుడు 5 సంవత్సరాల జైలు, 10 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
Read Also:Canada–India relations: భారత్పై మరోసారి విషం చిమ్ముతున్న కెనడా..
ఇన్స్టాగ్రామ్లో వీడియోను పంచుకుంటూ ‘హలో నేను పూనమ్. నన్ను క్షమించండి, నేను బాధపెట్టిన వారికి క్షమాపణలు చెబుతున్నాను. అందరినీ ఆశ్చర్యపరచడమే నా ఉద్దేశం, ఎందుకంటే మనం ఎక్కువగా మాట్లాడని గర్భాశయ క్యాన్సర్ గురించి చర్చించాలనుకున్నాను. అవును, నా మరణానికి సంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేశాను. అకస్మాత్తుగా మేమంతా గర్భాశయ క్యాన్సర్ గురించి మాట్లాడటం ప్రారంభించాము. ఇది నిశ్శబ్దంగా మీ జీవితాన్ని లాక్కునే వ్యాధి. ఈ వ్యాధి గురించి మరింత మాట్లాడవలసిన అవసరం ఉంది. నా మరణవార్త వల్ల అందరికీ ఈ వ్యాధి గురించి తెలిసినందుకు నేను గర్వపడుతున్నాను.’ అంటూ చెప్పుకొచ్చింది.
కంగనా రనౌత్, మునావర్ ఫరూఖీ, డైసీ షా, పూజా భట్ సహా పలువురు ప్రముఖులు ఆమె మరణవార్త పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్లో తన సంతాపాన్ని తెలియజేసింది. పూనమ్ పాండే తన రియాల్టీ షోలో భాగమైంది. ఇది చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ బారిన పడి యువతి ప్రాణాలు కోల్పోవడం విషాదం. పూనమ్ పాండే తన గర్భాశయ క్యాన్సర్ గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదని నటి సంభవనా సేథ్ చెప్పారు. ఖత్రోన్ కే ఖిలాడీ అనే రియాల్టీ షోలో పూనమ్తో కలిసి సంభవన్ పాల్గొంది.
Read Also:Telangana Cabinet Meeting: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చ..
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..