Poonam Pandey : పుకార్లు వ్యాప్తి చేసినందుకు పూనమ్ ను అరెస్ట్ చేస్తారా.. శిక్ష ఏంటంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Pandey : మోడల్, నటి పూనమ్ పాండే మరణ వార్తతో అందరూ షాక్ అయ్యారు. అయితే మరుసటి రోజు అంటే శనివారం పూనమ్ పాండే స్వయంగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేసి తాను బతికే ఉందని చెప్పింది. పూనమ్ పాండే స్వయంగా తన మరణ వార్తను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ప్రచారం కోసం ప్రయత్నించింది. ఆమె చర్యపై సోషల్ మీడియాలో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ న్యూస్ను ప్రచారం చేసినందుకు పూనమ్ పాండేపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అన్న సందేహాలు జనాల్లో తలెత్తుతున్నాయి.
నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు పూనమ్ జైలు శిక్ష అనుభవించవచ్చు. దీనితో పాటు జరిమానా కూడా విధించవచ్చు. ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 67 ప్రకారం, ఎవరైనా మొదటిసారి సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినందుకు దోషిగా తేలితే, అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే రూ.5 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. నేరం పునరావృతమైతే నేరస్థుడు 5 సంవత్సరాల జైలు, 10 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
Also Read
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
Read Also:Canada–India relations: భారత్పై మరోసారి విషం చిమ్ముతున్న కెనడా..
ఇన్స్టాగ్రామ్లో వీడియోను పంచుకుంటూ ‘హలో నేను పూనమ్. నన్ను క్షమించండి, నేను బాధపెట్టిన వారికి క్షమాపణలు చెబుతున్నాను. అందరినీ ఆశ్చర్యపరచడమే నా ఉద్దేశం, ఎందుకంటే మనం ఎక్కువగా మాట్లాడని గర్భాశయ క్యాన్సర్ గురించి చర్చించాలనుకున్నాను. అవును, నా మరణానికి సంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేశాను. అకస్మాత్తుగా మేమంతా గర్భాశయ క్యాన్సర్ గురించి మాట్లాడటం ప్రారంభించాము. ఇది నిశ్శబ్దంగా మీ జీవితాన్ని లాక్కునే వ్యాధి. ఈ వ్యాధి గురించి మరింత మాట్లాడవలసిన అవసరం ఉంది. నా మరణవార్త వల్ల అందరికీ ఈ వ్యాధి గురించి తెలిసినందుకు నేను గర్వపడుతున్నాను.’ అంటూ చెప్పుకొచ్చింది.
కంగనా రనౌత్, మునావర్ ఫరూఖీ, డైసీ షా, పూజా భట్ సహా పలువురు ప్రముఖులు ఆమె మరణవార్త పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్లో తన సంతాపాన్ని తెలియజేసింది. పూనమ్ పాండే తన రియాల్టీ షోలో భాగమైంది. ఇది చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ బారిన పడి యువతి ప్రాణాలు కోల్పోవడం విషాదం. పూనమ్ పాండే తన గర్భాశయ క్యాన్సర్ గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదని నటి సంభవనా సేథ్ చెప్పారు. ఖత్రోన్ కే ఖిలాడీ అనే రియాల్టీ షోలో పూనమ్తో కలిసి సంభవన్ పాల్గొంది.
Read Also:Telangana Cabinet Meeting: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చ..
తాజావార్తలు
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!