Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Murder Case: కన్న పేగు బంధాన్ని మరచి.. ప్రియుడుతో కలిసి కన్న తల్లిని ఓ కూతురు హత్య చేసిన ఘటన కలకం రేపుతోంది.. గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఓ మహిళను ఆమె కూతురు తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పొన్నూరు 8వ వార్డులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని లక్ష్మిగా గుర్తించారు.
డబ్బుల విషయంలో తల్లితో గొడవ
లక్ష్మికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆమె కుమారుడు మృతి చెందాడు. ప్రస్తుతం ఆమె కూతురు పుష్పలత ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. గతంలో ఆమెకు రెండు వివాహాలు జరిగినప్పటికీ కుటుంబ కలహాల కారణంగా ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పుష్పలత.. రాజా అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం లక్ష్మి తన బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు సమాచారం. ఆ డబ్బులు తనకు ఇవ్వాలని పుష్పలత తల్లిని కోరినట్లు తెలుస్తోంది. అయితే అందుకు లక్ష్మి అంగీకరించకపోవడంతో వివాదం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు
డబ్బులు ఇవ్వలేదనే కారణంతో పుష్పలత తన ప్రియుడు రాజాతో కలిసి తల్లి లక్ష్మిని హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పొన్నూరు అర్బన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, డబ్బుల వ్యవహారం, నిందితుల పాత్ర తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?