Ponnam Prabhakar : అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత వరంగల్, హనుమకొండ, కాజీపేట సిటీలు దూసుకుపోతున్నాయి..
- 3వ ఎడిషన్ క్రేడాయి వరంగల్ ప్రాపర్టీ షో ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- ఉత్తర దక్షిణ భారతదేశంలో కలిపే రైల్వే జంక్షన్లు వరంగల్ లో ఉన్నాయి
- రాబోయే కాలంలో వరంగల్ నగరానికి ఎయిర్పోర్ట్ రాబోతుంది : మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : హనుమకొండ జిల్లాలో 3వ ఎడిషన్ క్రేడాయి వరంగల్ ప్రాపర్టీ షోను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. క్రేడాయి ప్రాపర్టీ షో మూడవ ఎడిషన్ వరంగల్ లో విజయవంతంగా నిర్వహిస్తున్న క్రేడాయి ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ తరువాత వరంగల్, హనుమకొండ, కాజీపేట మూడు సిటీ లు కలిసి అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు మంత్రి పొన్నం. ఇటీవలే ఈ ప్రాంతంలో ఆరు వేల కోట్లతో ముఖ్యమంత్రి అభివృద్ది పనులు చేపట్టారని, ప్రాపర్టీ షో జరుగుతుంది అంటే వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంత వాసులు తాము కోనాలనుకున్న ప్రాపర్టీ ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే మనకి నచ్చింది తీసుకోవచ్చన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉత్తర దక్షిణ భారతదేశంలో కలిపే రైల్వే జంక్షన్లు వరంగల్ లో ఉన్నాయని, రాబోయే కాలంలో వరంగల్ నగరానికి ఎయిర్పోర్ట్ రాబోతుందని, వైద్య రంగంలో కాకతీయ మెడికల్ కాలేజి ఎంజీఎం లాంటి ప్రభుత్వ హాస్పిటల్ లు ఉన్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
కాకతీయ యూనివర్సిటీ , నిట్ లాంటి విద్యాసంస్థలు ఉన్నాయని, టెంపుల్ టూరిజం లో సమ్మక్క సారలమ్మ ఆలయం , రామప్ప ఆలయం ,వెయ్యి స్థంభాల గుడి ఉన్నాయన్నారు. వరంగల్ హనుమకొండ కాజీపేట లో మరింత అభివృద్ధి చెందడానికి చుట్టూ జాతీయ రహదారులు ఉన్నాయని, క్రేడాయి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానన్నారు. నియోజకవర్గ రెండు మండలాలు ఈ జిల్లాలో ఉన్నాయి..నేను జిల్లా మంత్రిగా మీకు అండగా ఉంటానని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ ఛైర్పర్సన్ బండా ప్రకాశ్ , ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి,వరంగల్ మేయర్ గుండు సుధారాణి,కూడా చైర్మన్ ,ఇనగాల వెంకట్ రామిరెడ్డి , క్రేడాయి ప్రతినిధులు పాల్గొన్నారు.
South Central Railways : ప్రయాణికుల రద్దీని ఎదుర్కొనేందుకు సన్నద్ధమైన దక్షిణ మధ్య రైల్వే..
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!