Ponnam Prabhakar: కేసీఆర్ నియమించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నియమించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.హిందు సంస్కారం తెలియని వ్యక్తి కిషన్ రెడ్డి అన్నారు. ఇక్కడి వాళ్ళను చేసుకున్నాక.. సోనియాగాంధీ ఇక్కడి మనిషి అయ్యిందన్నారు. దేశ సంస్కారం తెలియని వ్యక్తి కేంద్ర మంత్రి అవ్వడం అవమనకరమని దుయ్యబట్టారు. మొదటి దశ ఎన్నికల తర్వాత ప్రధాని హోదాలో ఉన్న ఆయన గౌరవం లేకుండా మట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు గుడిలో ఉండే దేవుణ్ణి రోడ్డు మీదకు తెచ్చారన్నారు. కిషన్ రెడ్డిని హనుమాన్ చాలీసా చూడకుండా చదవమని చెప్పారు. పదేళ్లు పని చేయించుకుని సిరిసిల్ల చేనేతలకు డబ్బులు ఇవ్వలేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల పాపంతోనే చేనేతలు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు ఇచ్చామని తెలిపారు. పాత బకాయిలు మేము ఇస్తున్నాం.. పైగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారన్నారు.
READ MORE: Nambur Shankar Rao: వైసీపీ గెలుస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుంది..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
నేతన్నల పట్ల తమకు సానుభూతి ఉందని పేర్కొన్నారు. ధైర్యం ఇవ్వాల్సింది పోయి.. బీఆర్ఎస్ నేతన్నలను ఆత్మహత్యలకు ప్రోత్సహిస్తుందని విమర్శించారు. హాస్టల్ పిల్లలకు అవసరం అయ్యే అన్ని వస్త్రాలు తామే కొంటామని.. విద్యార్థులు అధైర్య పడొద్దని స్పష్టం చేశారు. వస్త్ర రంగంపై జీఎస్టీ (gst) వేసింది బీజేపీ కాదా.? బండి సంజయ్ సమదానం చెప్పాలి.. అని ప్రశ్నించారు. చేనేతలకు కేంద్రం ఏం చేసేందో చెప్పాలన్నారు. సిరిసిల్లలో సమస్యలకు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీజేపీ కారణమా..? నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన మేమా..? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి కాబోయే మాజీ మంత్రి అని విమర్శించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!