Ponnam Prabhakar: కేసీఆర్ నియమించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నియమించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.హిందు సంస్కారం తెలియని వ్యక్తి కిషన్ రెడ్డి అన్నారు. ఇక్కడి వాళ్ళను చేసుకున్నాక.. సోనియాగాంధీ ఇక్కడి మనిషి అయ్యిందన్నారు. దేశ సంస్కారం తెలియని వ్యక్తి కేంద్ర మంత్రి అవ్వడం అవమనకరమని దుయ్యబట్టారు. మొదటి దశ ఎన్నికల తర్వాత ప్రధాని హోదాలో ఉన్న ఆయన గౌరవం లేకుండా మట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు గుడిలో ఉండే దేవుణ్ణి రోడ్డు మీదకు తెచ్చారన్నారు. కిషన్ రెడ్డిని హనుమాన్ చాలీసా చూడకుండా చదవమని చెప్పారు. పదేళ్లు పని చేయించుకుని సిరిసిల్ల చేనేతలకు డబ్బులు ఇవ్వలేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల పాపంతోనే చేనేతలు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు ఇచ్చామని తెలిపారు. పాత బకాయిలు మేము ఇస్తున్నాం.. పైగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారన్నారు.
READ MORE: Nambur Shankar Rao: వైసీపీ గెలుస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుంది..
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
నేతన్నల పట్ల తమకు సానుభూతి ఉందని పేర్కొన్నారు. ధైర్యం ఇవ్వాల్సింది పోయి.. బీఆర్ఎస్ నేతన్నలను ఆత్మహత్యలకు ప్రోత్సహిస్తుందని విమర్శించారు. హాస్టల్ పిల్లలకు అవసరం అయ్యే అన్ని వస్త్రాలు తామే కొంటామని.. విద్యార్థులు అధైర్య పడొద్దని స్పష్టం చేశారు. వస్త్ర రంగంపై జీఎస్టీ (gst) వేసింది బీజేపీ కాదా.? బండి సంజయ్ సమదానం చెప్పాలి.. అని ప్రశ్నించారు. చేనేతలకు కేంద్రం ఏం చేసేందో చెప్పాలన్నారు. సిరిసిల్లలో సమస్యలకు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీజేపీ కారణమా..? నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన మేమా..? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి కాబోయే మాజీ మంత్రి అని విమర్శించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!