Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ ప్రభుత్వంలో భూ హక్కుల కోసం చారిత్రాత్మక అడుగులు
- భూభారతి చట్టంతో పేదలకు భూమిపై సంపూర్ణ హక్కులు
- ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం వైపు దూసుకెళ్తోంది
- సీతారామ కాలువ, పోడు భూముల సమస్యలు త్వరలో పరిష్కారం : మంత్రి పొంగులేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మాట్లాడుతూ, ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితమై పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రగతి భవన్ను జ్యోతి రావు ఫూలే భవనంగా మార్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇది ప్రజలకు గౌరవం ఇచ్చే ముఖ్యమైన చిహ్నంగా నిలుస్తుందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ధరణిలో చోటుచేసుకున్న అవకతవకలన్నీ సరి చేయడం కోసం కొత్త భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావడమే కాకుండా, మూడు నెలలు కూడా పూర్తవకముందే దానికి సంబంధించిన విధానాలు రూపొందించడంలో ప్రభుత్వం చూపిన వేగాన్ని మంత్రి వివరించారు. అంబేడ్కర్ జయంతి రోజున శిల్పారామంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూభారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేయనున్నట్లు వెల్లడించారు.
Also Read
- Lionel Messi: ఫుట్బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గంజం మెస్సీ రిటైర్మెంట్..
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
పేదవారు సంపాదించిన భూమిపై సంపూర్ణ హక్కులు కల్పించేలా ఈ చట్టాన్ని రూపొందించామని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని ఆయన చెప్పారు. గత పదేళ్లలో అనేక భూసంబంధిత ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజల అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం రూపొందించబడిందని పేర్కొన్నారు. ఒక్క గజం భూమికి కూడా భద్రత కల్పించేలా భూభారతిలో ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో 8.19 లక్షల కోట్లు అప్పు చేసి, నాయకులు ఫామ్ హౌస్లలో విశ్రాంతి తీసుకున్నారని విమర్శించారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ఉన్నప్పటికీ, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని కొనియాడారు.
కాలేశ్వరం ప్రాజెక్టుపై కూడా మంత్రి స్పందించారు. గత ప్రభుత్వంలోనే ప్రాజెక్టు వాస్తవానికి కూలిపోయిందని తెలిపారు. కానీ అయినా Telangana రైతులు వర్షాకాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అధికంగా ధాన్యం ఉత్పత్తి చేయగలిగారని గర్వంగా వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా కొన్ని హామీల అమలు ఆలస్యం అవుతున్నా, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం, ప్రతిపక్షాల కుట్రలన్నీ కూడా నిజాయితీతో ఎదుర్కొంటూ, ప్రభుత్వం పేదలకు న్యాయం చేస్తుందని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో సాగులో ఉన్న సీతారామ కాలువ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. పోడు భూముల సమస్యను కూడా ఈ ప్రభుత్వం లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పులుసు బొంత ప్రాజెక్ట్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డి త్వరలో శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు.
Tariffs War: ట్రంప్ ఎఫెక్ట్.. ఇండియా తర్వాత, ఈయూ సాయం కోరిన చైనా..
తాజావార్తలు
-
Lionel Messi: ఫుట్బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గంజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!