Ponguleti Srinivas Reddy : యాసంగిలో 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడిగడ్డ బ్యారేజీకి కీలకమైన మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై తదుపరి అధ్యయనాలు/పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం సోమవారం నిర్ణయించింది . దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రానికి చెందిన మూడు సంస్థలను ఈ పని కోసం గుర్తించినట్లు తెలిపారు. ప్రతి బ్యారేజీకి సంబంధించిన భౌతిక మరియు సాంకేతిక అంశాలను గుర్తించిన రెండు సంస్థలు అధ్యయనం చేస్తాయి. ఎలాంటి మరమ్మతులు చేపట్టాలో వారి సిఫార్సులు మరియు ఫలితాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని, కమాండ్ ఏరియాలోని రైతుల సాగునీటి అవసరాలను తీర్చడానికి బ్యారేజీల నుండి నీటిని ఎత్తిపోసే అవకాశాలను అన్వేషించాలని ప్రాజెక్ట్ అధికారులను కోరినట్లు ఆయన చెప్పారు. యాసంగి లో 36 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం సివిల్ సప్లై శాఖ కొనుగోలు చేసిందని, కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు మూడు రోజుల్లోనే డబ్బులు ఖాతాలో వేశామన్నారు. గత పదేళ్లలో ఎప్పుడు ఇంత తొందరగా ధాన్యం సేకరించలేదు. డబ్బులు చెల్లించలేదని, అకాల వర్షాలు ఎప్పుడు లేని విధంగా పది రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్నాయని ఆయన తెలిపారు.
అంతేకాకుండా..’రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాల వల్ల జాగ్రత్తలు తీసుకున్నా ధ్యానం తడిసింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలు భాద్యత కలెక్టర్లకు అప్పగించాము. తడిసిన ధాన్యం పై రైతులు ఆందోళన చెందవద్దు. మధ్యాహ్న భోజనం కోసం, హాస్టల్స్ కోసం 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ఎన్నికల సమయంలో సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చాము. సన్న బియ్యం కింటకు 500 రూపాయల బోనస్ ఇస్తాం. సన్న బియ్యంను వ్యవసాయ అధికారులు గుర్తిస్తారు. బోగస్ విత్తనాలు అరికట్టాలని.. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాము. లూజ్ విత్తనాలు కొనుగోలు చేయవద్దు. సర్టిఫైడ్ దుకాణంలో కొనుగోలు చేసి రిసిప్ట్ రైతులు దగ్గర పెట్టుకోవాలి. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా రాబోయే నెల రోజుల్లో మోడ్రన్ స్కూల్స్ గా మారుస్తాం. ‘ అని మంత్రి పొంగులేటి తెలిపారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..