AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 5 గంటలకే ప్రధాన పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తైంది. మరోవైపు కర్నూలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండగా ఎన్నికల అధికారులు సైతం తగిన ఏర్పాట్లు చేశారు.
Read Also: Ram Charan : తండ్రి బాటలోనే తనయుడు.. దైవభక్తి కూడా ఎక్కువే..
Also Read
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
ఇక, సమస్యాత్మక.. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ దగ్గర ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని అరకు, రంపచోడవరం, పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం ఐదు గంటల వరకూ మాత్రమే పోలింగ్ జరగనున్నట్లు ఈసీ పేర్కొనింది. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ఠమైన భద్రతను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు.
Read Also: General Elections 2024 Live Updates : సార్వత్రిక ఎన్నికలు 4వ దశ పోలింగ్ లైవ్ అప్డేట్స్
ఇక, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,10,58,615 మంది మహిళలు ఉండగా.. 2,03,39,851 మంది పురుషులు ఉన్నారు. అలాగే, 3,421 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. రాష్ట్రంలోని 156 అసెంబ్లీ స్థానాల పరిధిలో పురుషుల కన్నా మహిళ ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ప్రజలు ఓట్లేసేందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా 46, 389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. పోలింగ్ కోసం లక్షా 60 వేల ఈవీఎంలు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,20,566 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. ఇక, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఈసీ పేర్కొనింది.
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?