Election Commission: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్పై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లలో విధానసభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్ను భారత ఎన్నికల సంఘం నిషేధించింది. హిమాచల్ ప్రదేశ్లోని 68 అసెంబ్లీ స్థానాలకు శనివారం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో డిసెంబర్ 1, 8 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.నవంబర్ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి, డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రచురించడాన్ని నిషేధిస్తూ పోల్ ప్యానెల్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒపీనియన్ పోల్ ఫలితాలు లేదా మరేదైనా పోల్ సర్వేతో సహా ఏదైనా ఎన్నికల విషయాలను ప్రదర్శించడం, ముగింపుకు నిర్ణయించిన గంటలతో ముగిసే 48 గంటలలో నిషేధించబడుతుందని ఎన్నికల విభాగం ప్రతినిధి తెలిపారు.‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126Aలోని సబ్-సెక్షన్ (ఎల్) కింద ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ భారత ఎన్నికల సంఘం నవంబర్ 12 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5.30 గంటల మధ్య వ్యవధిలో ఏదైనా ఎగ్జిట్ పోల్ నిర్వహించడం, ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురించడం లేదా ప్రసారం చేయడం, ఏదైనా ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిషేధించారు’’ అని ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది.
Also Read
- Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
- APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
- IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
- Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
Himachal Pradesh Congress Chief: 40-45 స్థానాల్లో గెలుస్తాం.. ఈ సారి ప్రభుత్వం మాదే..
ఈ సలహాను గెజిట్ నోటిఫికేషన్ రూపంలో తెలియజేయాలని, రికార్డు కోసం కమిషన్కు కాపీని పంపాలని హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ముఖ్య ఎన్నికల అధికారులను కూడా ఈసీ ఆదేశించింది. అన్ని న్యూస్ బ్యూరోలు, మీడియా సంస్థలు, రేడియో, టెలివిజన్ ఛానెల్లకు ఈ నోటిఫికేషన్ గురించి తెలియజేయాలని సంబంధిత అధికారులకు సూచించబడింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారం ముగియగా.. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర పోటీలో నిమగ్నమై ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలమైన పనితీరును కనబరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్టీలకతీతంగా మొత్తం 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ప్రభుత్వ కార్యాలయాలు, బోర్డులు, కార్పొరేషన్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థల ఉద్యోగులకు పోలింగ్ రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది.
తాజావార్తలు
-
Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
-
APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
-
Cooking Hacks: ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి!
-
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
-
Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!