Election Commission: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్పై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లలో విధానసభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్ను భారత ఎన్నికల సంఘం నిషేధించింది. హిమాచల్ ప్రదేశ్లోని 68 అసెంబ్లీ స్థానాలకు శనివారం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో డిసెంబర్ 1, 8 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.నవంబర్ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి, డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రచురించడాన్ని నిషేధిస్తూ పోల్ ప్యానెల్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒపీనియన్ పోల్ ఫలితాలు లేదా మరేదైనా పోల్ సర్వేతో సహా ఏదైనా ఎన్నికల విషయాలను ప్రదర్శించడం, ముగింపుకు నిర్ణయించిన గంటలతో ముగిసే 48 గంటలలో నిషేధించబడుతుందని ఎన్నికల విభాగం ప్రతినిధి తెలిపారు.‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126Aలోని సబ్-సెక్షన్ (ఎల్) కింద ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ భారత ఎన్నికల సంఘం నవంబర్ 12 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5.30 గంటల మధ్య వ్యవధిలో ఏదైనా ఎగ్జిట్ పోల్ నిర్వహించడం, ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురించడం లేదా ప్రసారం చేయడం, ఏదైనా ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిషేధించారు’’ అని ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది.
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
Himachal Pradesh Congress Chief: 40-45 స్థానాల్లో గెలుస్తాం.. ఈ సారి ప్రభుత్వం మాదే..
ఈ సలహాను గెజిట్ నోటిఫికేషన్ రూపంలో తెలియజేయాలని, రికార్డు కోసం కమిషన్కు కాపీని పంపాలని హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ముఖ్య ఎన్నికల అధికారులను కూడా ఈసీ ఆదేశించింది. అన్ని న్యూస్ బ్యూరోలు, మీడియా సంస్థలు, రేడియో, టెలివిజన్ ఛానెల్లకు ఈ నోటిఫికేషన్ గురించి తెలియజేయాలని సంబంధిత అధికారులకు సూచించబడింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారం ముగియగా.. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర పోటీలో నిమగ్నమై ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలమైన పనితీరును కనబరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్టీలకతీతంగా మొత్తం 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ప్రభుత్వ కార్యాలయాలు, బోర్డులు, కార్పొరేషన్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థల ఉద్యోగులకు పోలింగ్ రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది.
తాజావార్తలు
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్కు చిరంజీవి మెగా బర్త్డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్తో రోజంతా సాఫ్ట్గా!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!