Election Commission: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్పై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లలో విధానసభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్ను భారత ఎన్నికల సంఘం నిషేధించింది. హిమాచల్ ప్రదేశ్లోని 68 అసెంబ్లీ స్థానాలకు శనివారం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో డిసెంబర్ 1, 8 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.నవంబర్ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి, డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రచురించడాన్ని నిషేధిస్తూ పోల్ ప్యానెల్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒపీనియన్ పోల్ ఫలితాలు లేదా మరేదైనా పోల్ సర్వేతో సహా ఏదైనా ఎన్నికల విషయాలను ప్రదర్శించడం, ముగింపుకు నిర్ణయించిన గంటలతో ముగిసే 48 గంటలలో నిషేధించబడుతుందని ఎన్నికల విభాగం ప్రతినిధి తెలిపారు.‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126Aలోని సబ్-సెక్షన్ (ఎల్) కింద ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ భారత ఎన్నికల సంఘం నవంబర్ 12 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5.30 గంటల మధ్య వ్యవధిలో ఏదైనా ఎగ్జిట్ పోల్ నిర్వహించడం, ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురించడం లేదా ప్రసారం చేయడం, ఏదైనా ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిషేధించారు’’ అని ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది.
Also Read
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
Himachal Pradesh Congress Chief: 40-45 స్థానాల్లో గెలుస్తాం.. ఈ సారి ప్రభుత్వం మాదే..
ఈ సలహాను గెజిట్ నోటిఫికేషన్ రూపంలో తెలియజేయాలని, రికార్డు కోసం కమిషన్కు కాపీని పంపాలని హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ముఖ్య ఎన్నికల అధికారులను కూడా ఈసీ ఆదేశించింది. అన్ని న్యూస్ బ్యూరోలు, మీడియా సంస్థలు, రేడియో, టెలివిజన్ ఛానెల్లకు ఈ నోటిఫికేషన్ గురించి తెలియజేయాలని సంబంధిత అధికారులకు సూచించబడింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారం ముగియగా.. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర పోటీలో నిమగ్నమై ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలమైన పనితీరును కనబరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్టీలకతీతంగా మొత్తం 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ప్రభుత్వ కార్యాలయాలు, బోర్డులు, కార్పొరేషన్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థల ఉద్యోగులకు పోలింగ్ రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది.
తాజావార్తలు
-
Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!