Election Commission: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్పై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లలో విధానసభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్ను భారత ఎన్నికల సంఘం నిషేధించింది. హిమాచల్ ప్రదేశ్లోని 68 అసెంబ్లీ స్థానాలకు శనివారం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో డిసెంబర్ 1, 8 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.నవంబర్ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి, డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రచురించడాన్ని నిషేధిస్తూ పోల్ ప్యానెల్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒపీనియన్ పోల్ ఫలితాలు లేదా మరేదైనా పోల్ సర్వేతో సహా ఏదైనా ఎన్నికల విషయాలను ప్రదర్శించడం, ముగింపుకు నిర్ణయించిన గంటలతో ముగిసే 48 గంటలలో నిషేధించబడుతుందని ఎన్నికల విభాగం ప్రతినిధి తెలిపారు.‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126Aలోని సబ్-సెక్షన్ (ఎల్) కింద ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ భారత ఎన్నికల సంఘం నవంబర్ 12 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5.30 గంటల మధ్య వ్యవధిలో ఏదైనా ఎగ్జిట్ పోల్ నిర్వహించడం, ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురించడం లేదా ప్రసారం చేయడం, ఏదైనా ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిషేధించారు’’ అని ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Himachal Pradesh Congress Chief: 40-45 స్థానాల్లో గెలుస్తాం.. ఈ సారి ప్రభుత్వం మాదే..
ఈ సలహాను గెజిట్ నోటిఫికేషన్ రూపంలో తెలియజేయాలని, రికార్డు కోసం కమిషన్కు కాపీని పంపాలని హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ముఖ్య ఎన్నికల అధికారులను కూడా ఈసీ ఆదేశించింది. అన్ని న్యూస్ బ్యూరోలు, మీడియా సంస్థలు, రేడియో, టెలివిజన్ ఛానెల్లకు ఈ నోటిఫికేషన్ గురించి తెలియజేయాలని సంబంధిత అధికారులకు సూచించబడింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారం ముగియగా.. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర పోటీలో నిమగ్నమై ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలమైన పనితీరును కనబరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్టీలకతీతంగా మొత్తం 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ప్రభుత్వ కార్యాలయాలు, బోర్డులు, కార్పొరేషన్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థల ఉద్యోగులకు పోలింగ్ రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!